సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశాలోని సింగరేణికి చెందిన నైనీ బొగ్గు గని నుంచి మొదటి బొగ్గు రైల్వే వ్యాగన్ విజయవంతంగా తెలంగాణకు చేరుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (STPP) ఈ బొగ్గు రైలు చేరుకోగా, సింగరేణి అధికారులు, ఉద్యోగులు పూజలు నిర్వహించి ఘన స్వాగతం పలికారు.

ఈ మైలురాయిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ.. సింగరేణి యాజమాన్యానికి, కార్మికులకు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇది సింగరేణి విస్తరణ, ఉత్పత్తి పెంపుదల చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని ఆయన పేర్కొన్నారు.
తొలి విడతగా ఒడిశాలోని నైనీ గని నుంచి 59 వ్యాగన్ల ద్వారా సుమారు 4,000 టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గును రైలు మార్గంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు తరలించారు. ఈ బొగ్గు లభ్యతతో జైపూర్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కొరత తీరడంతో పాటు రవాణా వ్యయం కూడా తగ్గనుంది.
మరోవైపు నైనీ గని నుంచి బొగ్గు ఉత్పత్తి, రవాణా అనుకున్న లక్ష్యాల ప్రకారం నిరంతరాయంగా సాగేలా చూసేందుకు సింగరేణి ఉన్నతాధికారులు మంగళవారం ఒడిశాలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) గౌతమ్ పొత్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) బి. వెంకన్న అధ్యక్షతన ఈ భేటీ జరిగింది.
ఈ సమావేశంలో జిందాల్ స్టీల్, జిందాల్ ఇండియా పవర్ లిమిటెడ్, మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్, తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి ప్రధాన వినియోగదారుల ప్రతినిధులతో పాటు బొగ్గు రవాణా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో డైరెక్టర్ గౌతమ్ పొత్రు మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు. నైనీ బొగ్గు గని నుంచి ప్రతిఏటా 6 మిలియన్ టన్నుల (60 లక్షల టన్నులు) బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గును సమీపంలోని పవర్ ప్లాంట్లతో పాటు తెలంగాణలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు, అలాగే తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్లకు నిరంతరాయంగా సరఫరా చేస్తామన్నారు.
{{/usCountry}}సమావేశంలో డైరెక్టర్ గౌతమ్ పొత్రు మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు. నైనీ బొగ్గు గని నుంచి ప్రతిఏటా 6 మిలియన్ టన్నుల (60 లక్షల టన్నులు) బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గును సమీపంలోని పవర్ ప్లాంట్లతో పాటు తెలంగాణలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు, అలాగే తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్లకు నిరంతరాయంగా సరఫరా చేస్తామన్నారు.
{{/usCountry}}స్థానిక వినియోగదారులకు, రైల్వే సైడింగ్లకు అనుకున్న లక్ష్యాల మేరకు నిత్యం బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని రవాణా ఏజెన్సీలను ఆయన కోరారు. రైలు మార్గం ద్వారా వేగవంతమైన రవాణాను సులభతరం చేసేందుకు సమీపంలోని హిందోల్, కామాఖ్య నగర్ సైడింగ్లకు ప్రాధాన్యతా క్రమంలో సకాలంలో బొగ్గును చేర్చాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వెంకన్న స్పష్టం చేశారు. నైనీ గని నుండి రోజుకు కనీసం 12,000 టన్నుల బొగ్గును రవాణా చేసేలా సింగరేణి యాజమాన్యం పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తోంది.
ఒడిశా నైనీ గని పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా మరింత బలోపేతం కానుంది.