...
...
Next Story

హజ్ యాత్ర-2027 కోసం షెడ్యూల్, మార్గదర్శకాలు విడుదల.. సహాయకులనూ తీసుకెళ్లొచ్చు

తెలంగాణ హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ అఫ్జార్ బియాబానీ హజ్-2027కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించి.. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు మార్గదర్శకాలను ప్రకటించారు.

Published on: Jun 23, 2026, 18:07:53 IST
Advertisement

పవిత్ర హజ్ యాత్ర-2027(Haj 2027)కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ కీలక ప్రకటన చేసింది. యాత్రకు సంబంధించిన షెడ్యూల్, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు మార్గదర్శకాలను తెలంగాణ హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ అఫ్జర్ బియాబానీ అధికారికంగా విడుదల చేశారు. ముస్లిం సోదరులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

హజ్ యాత్ర 2027
హజ్ యాత్ర 2027

హజ్-2027 యాత్రకు వెళ్లాలనుకునే అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 22, 2026 నుంచే ప్రారంభమైందని ఛైర్మన్ వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి జూలై 20, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తుదారుల వద్ద తప్పనిసరిగా అంతర్జాతీయ పాస్‌పోర్ట్ ఉండాలి. ఈ పాస్‌పోర్ట్ గడువు కనీసం డిసెంబర్ 31, 2027 వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని స్పష్టం చేశారు.

ఒక హజ్ కవర్ నెంబర్ కింద గరిష్టంగా ఐదుగురు వయోజన యాత్రికులు కలిసి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. యాత్రికుల సౌకర్యార్థం దరఖాస్తుదారులను కొన్ని ప్రత్యేక కేటగిరీలుగా విభజించారు.

65 సంవత్సరాల వయస్సు పైబడిన వృద్ధులు తమతో పాటు సహాయకుడిగా 65 ఏళ్ల లోపు ఉన్న ఒక వ్యక్తిని తీసుకెళ్లవచ్చు. ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారిని ఎలాంటి డ్రా లేకుండానే నేరుగా యాత్రకు ఎంపిక చేస్తారు. 'మెహ్రమ్' (తోడుగా వచ్చే పురుషుడు) లేకుండా ఒంటరిగా ప్రయాణించాలనుకునే 45 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేక కేటగిరీని కేటాయించారు. నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకున్న ఈ మహిళలను కూడా ఎటువంటి డ్రా లేకుండానే యాత్రకు ఎంపిక చేయనున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe