...
...
Next Story

South Central Railway : రైల్వే సరుకు రవాణాలో సరికొత్త సేవలు - వెల్దుర్తి నుంచి ఉక్కు, జానకంపేట నుంచి మక్కల రవాణా

South Central Railway Freight Network : దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది . హైదరాబాద్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి నుంచి ఇనుము, ఉక్కు.. జానకంపేట నుంచి మక్కల (మొక్కజొన్న) రవాణాను విజయవంతంగా ప్రారంభించింది.

Published on: Jun 13, 2026 02:05 PM IST
Advertisement

South Central Railway Freight Network : దక్షిణ మధ్య రైల్వే (SCR) తన సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ, సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. రైల్వే నెట్‌వర్క్ ద్వారా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను వేగవంతం చేయడానికి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి, జానకంపేట రైల్వే స్టేషన్ల నుంచి సరికొత్త వస్తువుల లోడింగ్‌ను రైల్వే శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఈ సరికొత్త చొరవ అటు పారిశ్రామికవేత్తలకు, ఇటు రైతులకు ఎంతగానో లబ్ధి చేకూర్చనుంది.

వెల్దుర్తి నుంచి ఇనుము, ఉక్కు రవాణా:

రైల్వే సరుకు రవాణాలో సరికొత్త సేవలు (ఫైల్ ఫొటో)
రైల్వే సరుకు రవాణాలో సరికొత్త సేవలు (ఫైల్ ఫొటో)

కర్నూలు జిల్లా పరిధిలోని వెల్దుర్తి రైల్వే స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రత్యేకమైన కంటైనర్ టెర్మినల్‌ను (ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ చరిత్రలోనే తొలిసారిగా… స్థానిక ఉక్కు కర్మాగారంలో తయారైన పిగ్ ఐరన్, టీఎంటీ స్టీల్ బార్లతో కూడిన మొదటి కంటైనర్ రేక్‌ను ఇక్కడి నుంచి లోడ్ చేశారు. ఈ సరుకును దేశంలోని కీలక పారిశ్రామిక నగరాలైన ఢిల్లీ, ముంబైతో పాటు పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు రవాణా చేయనున్నారు. వెల్దుర్తిలో అందుబాటులోకి వచ్చిన ఈ టెర్మినల్ ద్వారా పరిశ్రమలకు అత్యంత వేగవంతమైన, నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సౌకర్యం లభించినట్లయింది.

జానకంపేట నుంచి తెలంగాణ మక్కలు:

మరోవైపు నిజామాబాద్ జిల్లా పరిధిలోని జానకంపేట స్టేషన్‌ను గూడ్స్ రవాణాకు అనుకూలంగా మారుస్తూ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ స్టేషన్ నుంచి తొలిసారిగా 21 వ్యాగన్లతో కూడిన మినీ రేక్‌లో మొక్కజొన్నను (మక్కలు) విజయవంతంగా లోడ్ చేశారు. ఈ వ్యవసాయ ఉత్పత్తులను మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) ప్రాంతానికి తరలిస్తున్నారు.

ఈ నిర్ణయంతో తెలంగాణ రైతులు తమ పంటను అత్యంత తక్కువ ఖర్చుతో, సురక్షితంగా మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి రవాణా చేసుకునే అవకాశం కలిగింది. ఇది మరాఠ్వాడా ప్రాంత ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడమే కాకుండా, మన రైతులకు మంచి మద్దతు ధర లభించేలా చేస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe