పదో తరగతి కూడా పాస్ అవ్వని వ్యక్తి..డెంటిస్ట్గా చెలామణి అవుతున్నాడు. ఎంతో మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేశాడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అందరూ ఉదయం నుంచి రాత్రివరకు క్లీనిక్ రన్ చేస్తుంటే.. అతడు మాత్రం రాత్రి నుంచి ఉదయం వరకు క్లీనిక్ ఓపెన్ చేసి పెడతాడు. ఈ మోసగాడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్లో నేరెడ్మెట్కు 20 ఏళ్ల క్రితం రమేశ్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు. తాను డెంటిస్ట్నని నేరెడ్మెట్లో దుకాణం తెరిచాడు. ఇక అప్పటి నుంచి ఈ పది పాస్ కానీ.. డెంటిస్ట్.. పేషెంట్లకు సేవలు అందిస్తూనే ఉన్నాడు. మార్చి 24న మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(SOT) జరిపిన దాడుల్లో అతని అక్రమ క్లినిక్ బయటపడటంతో అరెస్టు చేశారు.
ఉత్తర ప్రదేశ్కు చెందిన ఈ ఫేక్ డెంటిస్ట్ రమేష్.. 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు. కానీ నకిలీ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) సర్టిఫికేట్లను ఉపయోగించి అర్హత కలిగిన దంతవైద్యుడిగా చెప్పుకుంటూ వస్తున్నాడు. విచారణలో తేలిన విషయం ఏంటంటే.. రమేష్ ప్రధానంగా అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు క్లినిక్ను నడుపుతాడు. ఈ అసాధారణమైన పనివేళలతో ఇటీవల కొందరి అనుమానం కూడా వచ్చింది.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇటీవల శంషాబాద్లో పెద్ద ఆసుపత్రి పెట్టేందుకు కూడా ప్లాన్ చేశాడు. ఈ ఫేక్ డెంటిస్ట్పై స్థానిక వైద్యులకు కూడా అనుమానం వచ్చింది. ఆ తర్వాత రమేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువు కూడా పూర్తి చేయకపోయినా.. తనను తాను అర్హత కలిగిన దంతవైద్యుడిగా పరిచయం చేసుకుని, సంవత్సరాల తరబడి రోగులకు చికిత్స అందించాడు.
ఎస్ఓటీ అధికారులు రమేష్ క్లినిక్పై దాడి చేసి.. రమేష్కు ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హత లేదని, అతను దాదాపు 20 ఏళ్లుగా అక్రమంగా దంతవైద్యం చేస్తున్నాడని నిర్ధారించుకున్నారు. ఇన్నాళ్లు ఎవరికీ తెలియకుండా తన కార్యకలాపాలను ఎలా కొనసాగించగలిగాడు? అమాయక రోగులపై ఏ స్థాయిలో చికిత్సలు చేశాడు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
{{/usCountry}}ఎస్ఓటీ అధికారులు రమేష్ క్లినిక్పై దాడి చేసి.. రమేష్కు ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హత లేదని, అతను దాదాపు 20 ఏళ్లుగా అక్రమంగా దంతవైద్యం చేస్తున్నాడని నిర్ధారించుకున్నారు. ఇన్నాళ్లు ఎవరికీ తెలియకుండా తన కార్యకలాపాలను ఎలా కొనసాగించగలిగాడు? అమాయక రోగులపై ఏ స్థాయిలో చికిత్సలు చేశాడు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
{{/usCountry}}