సికింద్రాబాద్లో బోనాల పండుగ వైభవంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్లోని ప్రసిద్ధ చారిత్రక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత భక్తిశ్రద్ధల నడుమ కన్నులపండువగా జరుగుతోంది. ఆదివారం ఈ వేడుకకు నగర నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.

ఉదయం వేళల్లోనే ఎండ తీవ్రత 30 డిగ్రీల సెల్సియస్కు చేరినప్పటికీ, భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన క్యూ లైన్లు ఆలయ చుట్టుపక్కల రోడ్ల వెంబడి దాదాపు కిలోమీటరు మేర సాగాయి.
భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటలకే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకోవడం ప్రారంభించారు. తెల్లవారుజామున వచ్చిన వారికి ఎలాంటి రద్దడి లేకుండా సులభంగా అమ్మవారి దర్శనం లభించింది.
అయితే, ఉదయం 8 గంటల సమయం దాటిన తర్వాత భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. జనసందోహం పోటెత్తడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలోనే నిలబడి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దడిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తూ, క్యూ లైన్లలో తాగునీరు అందించేలా వసతులు కల్పించారు.
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తులు తొట్టెలు, బోనాలతో తమ మొక్కులను చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటే సకల రోగాలు నయమవుతాయని, సుభిక్షంగా ఉంటామని భక్తుల గాఢమైన నమ్మకం. ఈ పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ప్రాంతమంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. అమ్మవారి జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీ, పోలీసులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సేవలందిస్తున్నారు.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బంగారు బోనం, పట్టువస్త్రాలు, సమర్పించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీ సజ్జనార్ దంపతులతోపాటుగా పలువురు ప్రముఖులు అమ్మవారికి బోనం సమర్పించి మెుక్కులు చెల్లించుకున్నారు.
{{/usCountry}}ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బంగారు బోనం, పట్టువస్త్రాలు, సమర్పించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీ సజ్జనార్ దంపతులతోపాటుగా పలువురు ప్రముఖులు అమ్మవారికి బోనం సమర్పించి మెుక్కులు చెల్లించుకున్నారు.
{{/usCountry}}