AIIMS Bibinagar Recruitment : ఎయిమ్స్ బీబీనగర్లో ఉద్యోగ ఖాళీలు - కేవలం ఇంటర్వ్యూనే, వెంటనే అప్లయ్ చేసుకోండి
ఎయిమ్స్ బీబీనగర్లో నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 13 సీనియర్ రెసిడెంట్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఫిబ్రవరి 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 13 ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరి కింద 8 ఖాళీలను చూపారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 23వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డీఎన్బీ, పీజీ, ఎంఎస్, ఎండీ, ఎంసీహెచ్, డీఎంలో ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం…
ఈ పోస్టులకు అధికారిక వెబ్ సైట్ లోని గూగుల్ ఫామ్ ను పూర్తి చేయాలి. https://aiimsbibinagar.edu.in/ వెబ్ సైట్ లో ఈ ఫామ్ ఉంటుంది. మీ విద్యా అర్హతలతో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి. ఏమైనా సమస్యలు వస్తే jr.aiimsbibinagar@gmail.com కు మెయిల్ చేయవచ్చు. మీ దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, ఎంబీబీఎస్ డిగ్రీ, ఇంటర్న్ షిప్, యూజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఎంసీఐ రిజిస్ట్రేషన్, కుల ధ్రువీకరణపత్రంతో పాటు ఇతర పత్రాలను (జిరాక్స్) తీసుకెళ్లాలి. ఎంపికైన వారికి నెలకు రూ.67,700 జీతం ఇస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,770 చెల్లించాలి. AIIMS BIBINAGAR పేరు మీద డీడీ తీయాలి. ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల లోపు పంపిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

