...
...
Next Story

ఫోన్ ట్యాపింగ్ కేసు : ముగిసిన కేటీఆర్ ‘సిట్’ విచారణ - 7 గంటలకుపైగా ప్రశ్నలు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలకుపైగా సిట్ అధికారులు విచారించారు. మరోవైపు కేటీఆర్ విచారణ వేళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోహరించారు.

Published on: Jan 23, 2026 06:38 PM IST
Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా… దాదాపు 7 గంటలకుపైగా విచారణ కొనసాగింది. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

కేటీఆర్
కేటీఆర్

మరోవైపు కేటీఆర్ సిట్ విచారణ జరుగుతున్నంత సేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోహరించారు. ఓవైపు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ…. పార్టీ నేతలు, కార్యకర్తలు స్టేషన్ పరిసరాల్లోనే ఉన్నారు.

'సిట్' విచారణపై వార్తలు - బీఆర్ఎస్ సీరియస్

ఇక సిట్ విచారణపై పలు మీడియా ఛానెళ్లలో వచ్చిన వార్తలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. “సిట్ విచారణలో భాగంగా ఇలా జరుగుతోంది, అలా జరుగుతోంది అని కొన్ని చానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిళ్లు పనిగట్టుకుని అబద్ధాలను ప్రసారం చేస్తున్నాయి. ఆధారాలు లేకుండా ఇటువంటి వార్తలు ప్రసారం చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. నిరాధారమైన వార్తలు, వ్యక్తిత్వహననం చేసే కథనాల మీద బీఆర్ఎస్ పార్టీ లీగల్‌ చర్యలు చేపడుతుంది అని హెచ్చరిస్తున్నాం” అని స్పష్టం చేసింది.

సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాదు.. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌గా మారిపోయిందని బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… మీడియా ఛానళ్లు అడ్డగోలుగా లీక్ వార్తలు ఆపాలని సూచించారు. అసలు లోపల జరుగుతున్న విచారణ గురించి మీడియాకు లీక్ ఎవరు ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. లోపల జరగని దాన్ని నిజం అన్నట్లు బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe