ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలనే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ విచారించగా…తాజాగా కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని ఆదేశించింది.

రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత… ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. గత బీఆర్ఎస్ హయాంలో కొందరు అధికారులు, నేతలు ట్యాంపింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ… విచారణ కూడా జరిపిస్తోంది. ఇందుకోసం ఇటీవలనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ కూడా ఏర్పాటు చేసింది.
ఇటీవలే ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించింది. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ తర్వాత బయటికి వచ్చిన హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ… అడిగిందే అడిగారని కొత్తగా ఏం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నామనే కారణంతోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారని అన్నారు. విచారణ పేరుతో వేధించినా…. ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
అయితే హరీశ్ రావు విచారణ జరిగిన రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ కావటం హాట్ టాపిక్ గా మారింది. అయితే సిట్ నోటీసులను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
కేటీఆర్కు సిట్ నోటీసులు కాంగ్రెస్ సర్కారు నాటకమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. “పాలన గాలికి వదిలి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ఇవి.యూరియా కొరతతో రైతులు తండ్లాడుతుంటే కనీసం సమీక్షించే నాథుడు లేడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మొగలి రేకులు సీరియల్ నడిపిస్తుంది. రేవంత్ సర్కారు ఆడించినట్లు పోలీస్ యంత్రాంగం ఆడుతుండం విచారకరం” అని వ్యాఖ్యానించారు.
{{/usCountry}}కేటీఆర్కు సిట్ నోటీసులు కాంగ్రెస్ సర్కారు నాటకమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. “పాలన గాలికి వదిలి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ఇవి.యూరియా కొరతతో రైతులు తండ్లాడుతుంటే కనీసం సమీక్షించే నాథుడు లేడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మొగలి రేకులు సీరియల్ నడిపిస్తుంది. రేవంత్ సర్కారు ఆడించినట్లు పోలీస్ యంత్రాంగం ఆడుతుండం విచారకరం” అని వ్యాఖ్యానించారు.
{{/usCountry}}“ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా మారింది. రెండేళ్లుగా దర్యాప్తు బృందం కొండనుతవ్వి ఎలుకను కూడా పట్టలేదు. అధికారులు మారుతున్నారు కానీ ఆధారాలు చూపించడం లేదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంతకుముందే చెప్పారు” అని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.