...
...
Next Story

ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 20న 2 రైళ్లు రద్దు.. ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టైమింగ్స్ మార్పు!

ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా మేడ్చల్-లింగంపల్లి, ఉమ్దానగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది.

Published on: Jun 17, 2026, 14:26:38 IST
Advertisement

హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణ, అత్యవసర ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నగరంలోని పలు కీలక రూట్లలో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2026, జూన్ 20వ తేదీన (శనివారం) ఈ రద్దు వర్తిస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కాచిగూడ-ధోన్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న ఈ ట్రాక్ నిర్వహణ పనుల వల్ల కింది రెండు ప్రధాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. రైలు నెంబర్ 47222 (మేడ్చల్ – లింగంపల్లి) సాధారణంగా ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 07:40 గంటలకు మేడ్చల్‌లో బయలుదేరి మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, బేగంపేట, హైటెక్ సిటీ మీదుగా ఉదయం 09:55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. జూన్ 20న ఈ సర్వీస్ అందుబాటులో ఉండదు.

రైలు నెంబర్ 47252 (ఉమ్దానగర్ – సికింద్రాబాద్) రైలు ప్రతిరోజూ ఉదయం 11:20 గంటలకు ఉమ్దానగర్‌లో బయలుదేరి ఫలక్‌నుమా, మలక్‌పేట, కాచిగూడ మీదుగా మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీస్‌ను కూడా అధికారులు రద్దు చేశారు. రైళ్ల రాకపోకలను మరింత సురక్షితంగా, వేగంగా, సాఫీగా సాగించేందుకు ఈ ముందస్తు నిర్వహణ పనులు ఎంతో అవసరమని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

ట్రాక్ పటిష్టత బాగుంటేనే భవిష్యత్తులో ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, నిత్యం ఈ రూట్లలో ప్రయాణించే వారు ఈ మార్పులను గమనించాలని రైల్వే శాఖ కోరింది. శనివారం ఉదయం పూట కార్యాలయాలకు లేదా ఇతర పనులకు వెళ్లేవారు ఇబ్బంది పడకుండా తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయంగా మెట్రో లేదా ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ రైలు టైమింగ్స్ మార్పు

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe