ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. వేసవి వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - షాలిమార్ మధ్య వారపు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ వివరాలను ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
వీక్లీ స్పెషల్ ట్రైన్స్ - వివరాలు:
- దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. ఏప్రిల్ 4 తేదీ నుంచి జూన్ 27 వరకూ చర్లపల్లి-షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.
- చర్లపల్లి - షాలిమార్ (ట్రైన్ నెంబర్ 08046) మధ్య నడిచే రైళ్లు… ఉదయం 6.55కు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 నిమిషాలకు ఒడిశాలోని షాలిమార్ కు చేరుకుంటాయి. మొత్తం 13 సర్వీసులుంటాయి.
- షాలిమార్ - చర్లపల్లి మధ్య (ట్రైన్ నెంబర్ 08045 ) మధ్య మరో 13 ప్రత్యేక రైళ్లుంటాయి. షాలిమార్ నుంచి అర్ధరాత్రి 12.30కు బయలుదేరే ప్రత్యేక రైళ్లు… తర్వాతి రోజు తెల్లవారుజామున 4.30కు చర్లపల్లి చేరుకుంటాయి. ఈ రైళ్లు ఏప్రిల్ 3వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయి.

మొత్తం కలిపి ఈ రూట్లలో 26 ప్రత్యేక రైళ్లుంటాయి. ఈ ప్రత్యేక రైళ్లకు రెండు వైపులా తెలుగు రాష్ట్రాల్లో కాజీపేట, వరంగల్, మహబాబూబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.
అంతేకాకుండా బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్పూర్ కియోంజర్ రోడ్, భద్రక్, బాలసోర్, ఖరగ్పూర్, సంత్రాగచ్చి స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, క్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.