...
...
Next Story

ధరణి, భూభారతి పోర్టల్స్‌లో అవకతవకలపై విచారణకు ప్రత్యేక కమిటీ

ధరణి, భూభారతి పోర్టళ్లలో జరిగిన అక్రమాల నిగ్గుతేల్చేడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్‌ రూపకల్పనలో భద్రతా లోపాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటుంది.

Published on: Jul 2, 2026, 05:56:12 IST
Advertisement

ధరణి, భూ భారతి భూ రికార్డుల పోర్టల్‌లలో అవకతవకలు జరిగినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. దీనిపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి, ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు సిఫార్సు చేయడంతోపాటు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

ఒక ప్రకటనలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రకారం 15 రోజుల్లోగా తన నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని వెల్లడించారు. భూ రికార్డుల భద్రత, సమగ్రత, పారదర్శకత విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని స్పష్టం చేశారు.

ఈ కమిటీలో మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారి హర్ష వర్ధన్ (ఐపీఎస్), సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మందా మకరందు, తెలంగాణ సీఐబీ సైబర్ క్రైమ్స్ డీఎస్పీ ఎ.సంపత్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ డీఐజీ ఎం.సుభాషిణి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) సీనియర్ డైరెక్టర్ (ఐటీ) ఎ.శ్రీనివాస సుబ్బారావు ఉన్నారు.

ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొంటూ, ధరణి పోర్టల్‌పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ పురోగతిని సమీక్షించడానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సచివాలయంలో విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారని లోకేష్ కుమార్ తెలిపారు. ఆందోళన కలిగించే అనేక అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రెవెన్యూ కార్యదర్శి ప్రకారం, ధరణి పోర్టల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్‌లో అంతర్లీనంగా ఉన్న భద్రతా లోపాలను ఫోరెన్సిక్ ఆడిట్ వెల్లడించింది. ఈ లోపాలను స్వార్థ ప్రయోజనాలు గల వ్యక్తులు కొన్ని మాడ్యూళ్ల ద్వారా అనధికారిక ప్రవేశాలు చేయడానికి ఉపయోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

రెవెన్యూ మంత్రి ఆదేశాల మేరకు, భూ రికార్డులను భద్రపరచడానికి, భవిష్యత్తులో ఉల్లంఘనలను నివారించడానికి అత్యున్నత భద్రతా ప్రమాణాలను పొందుపరిచే పూర్తిగా కొత్త సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేయమని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌ను కోరింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ లావాదేవీలలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అవకతవకల స్థాయిని నిర్ధారించేందుకు, ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అన్ని లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe