తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ సన్నాహకాల్లో భాగంగా కమిషన్ జిల్లా, మున్సిపల్ అధికారులతో సమన్వయాన్ని పెంచుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడానికి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా జనవరి 13న టీ-పోల్ యాప్లో అందుబాటులో ఉంటుంది. జనవరి 12వ తేదీలోగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని కమిషన్ అధికారులను ఆదేశించింది. అలాగే పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను జనవరి 13న టీ-పోల్ మొబైల్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలని కూడా సూచించింది. జనవరి 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాలను విడుదల చేయాలని అధికారులకు ఎన్నికల సంఘం తెలిపింది.
బ్యాలెట్ పెట్టెలు, సామగ్రిని సిద్ధంగా ఉంచాలి, కోడ్ కఠినంగా అమలు చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. 2019 ఓటర్ల జాబితానే ప్రాథమిక జాబితాగా పరిగణిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల వివరాలను ధృవీకరించాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ ఓటరు నమోదు మరియు సవరణల కోసం సౌకర్యాలు కల్పించినట్లు కమిషన్ తెలిపింది.
ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
జనవరి 12, 2026 అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు చివరి తేదీ గా నిర్ణయించారు. జనవరి 13, 2026 అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిశీలన ప్రారంభం అవుతుంది. జనవరి 16, 2026 తుది ఓటర్ల జాబితా ప్రచురణ చేస్తారు.
{{/usCountry}}జనవరి 12, 2026 అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు చివరి తేదీ గా నిర్ణయించారు. జనవరి 13, 2026 అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిశీలన ప్రారంభం అవుతుంది. జనవరి 16, 2026 తుది ఓటర్ల జాబితా ప్రచురణ చేస్తారు.
{{/usCountry}}రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. గడువు ముగియని 4 మున్సిపాలిటీలతోపాటుగా జీహెచ్ఎంసీని కూడా ప్రస్తుత ఎన్నికల నుంచి మినహాయించారు. పెరిగిన జీహెచ్ఎంసీని మూడుగా విభాగాలుగా చేయాలన్న ప్రతిపాదన కారణంగా వాయిదా వేశారు.
గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో, కమిషన్ జిల్లా, మున్సిపల్ అధికారులతో కీలక సంప్రదింపులు జరిపింది. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది.