'1000 కట్టు, ఫ్లాట్ పట్టు'లాంటి లక్కీ డ్రాలు నమ్మి మోసపోవద్దు.. పోలీసుల వార్నింగ్!
ఈ మధ్య కాలంలో అనేక మంది రియల్టర్లు, ఆస్తి యజమానులు ఇళ్ళు, ఓపెన్ ప్లాట్ల కోసం లక్కీ డ్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై సూర్యాపేట జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
రియల్ ఎస్టేట్ ఆస్తులకు లక్కీ లాటరీలు నిర్వహించి ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.నరసింహ హెచ్చరించారు. అనేక మంది రియల్టర్లు, ఆస్తి యజమానులు ఇళ్ళు, ఓపెన్ ప్లాట్ల కోసం ఒక ధర పెట్టి లక్కీ డ్రాల కోసం కూపన్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి లక్కీ డ్రాలతో మోసం చేసేవారికి హెచ్చరికలు జారీ చేశారు.

"1000 కట్టు, ఫ్లాట్ పట్టు" వంటి ఆకర్షణీయమైన లైన్స్ ఉపయోగించి జిల్లాలో కొంతమంది రియల్టర్లు ఈ లాటరీలను నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎస్పీ నరసింహ చెప్పారు. ఇది చట్టం ప్రకారం నేరమన్నారు. కూపన్లను విక్రయించడానికి సోషల్ మీడియాలో యూపీఐ స్కాన్ కోడ్లను కూడా షేర్ చేస్తున్నారన్నారు. దీనివల్ల ఆర్థిక మోసానికి అవకాశం ఏర్పడుతుందని ఎస్పీ చెప్పారు. పోలీసులు కొంతమంది నిర్వాహకులను గుర్తించి వారిని హెచ్చరించారని వెల్లడించారు. ఇలాంటి పథకాల బారిన పడవద్దని, మోసపూరిత లాటరీలకు డబ్బు చెల్లించవద్దని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఇటీవలి కాలంలో ఆస్తిని అమ్మడానికి చాలా మంది ఇలాంటి లక్కీ డ్రా పద్ధతి పాటిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వాన్నపల్లి గ్రామానికి చెందిన రైతు రాజు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. తన 2 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని విక్రయించేందుకు లక్కీ డ్రాను ఏర్పాటు చేస్తున్నారు. రూ.10,000 చొప్పున మెుత్తం 500 టికెట్లు విక్రయించాలనుకుంటున్నారు రైతు. 500 టికెట్లు అమ్మితే రైతుకు మెుత్తం రూ.50 లక్షలు వస్తాయి. అయితే స్థానికంగా ఆ భూమి మార్కెట్ విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ డ్రా ద్వారా అదనంగా రాబట్టాలని రైతు లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొన్ని రోజుల కిందట యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఒక వ్యక్తి తన ఇంటి స్థలాన్ని లక్కీ డ్రా ద్వారా అమ్మారు. రూ.16 లక్షల విలువైన ఇంటిని లక్కీ డ్రా ద్వారా విక్రయించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పాప పేరు మీద వారి కుటుంబ లక్కీ డ్రాలో పాల్గొన్నారు. ఆ పాప లక్కీ డ్రాలో ఇంటిని గెలుచుకుంది.
అయితే ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే యూపీఐ క్యూఆర్ కోడ్లకు డబ్బులు పంపకూడదని చెబుతున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


