అవినీతి అధికారులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ మార్గాల్లో కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టిన సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు గురువారం అధికారికంగా వెల్లడించారు. నిందితుడికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ఆయన బంధువులు, సహచరుల ఇళ్లపై ఏకకాలంలో దాడి చేసిన అధికారులు భారీగా అక్రమాస్తులను వెలికితీశారు.

సూర్యాపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వి. సోమయ్య తన ఉద్యోగ పదవిని అడ్డుపెట్టుకుని, అవినీతి అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు ఆర్జించారనే విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. అవినీతి నిరోధక చట్టం, 1988 (2018 సవరణ చట్టం) ప్రకారం సోమయ్యపై ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో గురువారం ఉదయాన్నే అధికారులు సోమయ్య ఇల్లు, ఆఫీసుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 7 ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు.
భారీగా ఆస్తులు….
ఈ తనిఖీల్లో అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. సోమయ్య పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద భారీగా స్థిరాస్తులు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. అందులో 3 ఎకరాల వ్యవసాయ భూమి, 5 నివాస గృహాలు, మరియు 8 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన ఆస్తి పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తుల ప్రభుత్వ విలువ రూ.3.54 కోట్లుగా ప్రాథమికంగా లెక్కించినప్పటికీ…. బహిరంగ మార్కెట్లో వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేవలం స్థిరాస్తులే కాకుండా భారీగా నగదు, బంగారం, వాహనాలను కూడా అధికారులు గుర్తించారు. సోదాల సమయంలో రూ.4.63 లక్షల నికర నగదు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.13 లక్షల బ్యాలెన్స్, 709 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,750 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, ఇంటి విలువైన వస్తువులు మరియు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను లెక్కించారు.
{{/usCountry}}కేవలం స్థిరాస్తులే కాకుండా భారీగా నగదు, బంగారం, వాహనాలను కూడా అధికారులు గుర్తించారు. సోదాల సమయంలో రూ.4.63 లక్షల నికర నగదు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.13 లక్షల బ్యాలెన్స్, 709 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,750 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, ఇంటి విలువైన వస్తువులు మరియు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను లెక్కించారు.
{{/usCountry}}మరోవైపు నిందితుడైన అధికారి బ్యాంకుల్లో రూ.49 లక్షల మేర గోల్డ్ లోన్ తీసుకున్నట్లు ఏసీబీ తనిఖీల్లో తేలింది. వీటికి తోడు సోమయ్యకు సంబంధించి ఇంకా ఇతర ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.