గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. సంబంధిత కేంద్రాల వద్ద బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. అయితే కొందరు దళారుల ప్రమేయంలో కృతిమ కొరతను సృష్టించి… రైతులను ఇబ్బందిపడేలా చేశారని ప్రభుత్వం గుర్తించింది. ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేలా ‘యూరియా యాప్’ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారానే ఈ యాసంగి సీజన్లో రైతులకు యూరియా అందించనుంది.
యూరియా బుకింగ్ యాప్ - ముఖ్యమైన విషయాలు:
- పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈనెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాప్ ద్వారానే యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. ఇం
- ఇందుకోసం ప్రతి పర్టిలైజర్ షాపు వద్ద వలంటీర్ను ఏర్పాటు చేస్తారు. అవగాహన ఉన్న రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చు.
- సముచితంగా, పారదర్శకంగా యూరియా పంపిణీ చేయటమే ఈ యాప్ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. నిజమైన సాగుదారులకు మాత్రమే యూరియా సరఫరా చేయాలని… సమతుల్య ఎరువుల వినియోగానికి ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది.
- యాప్ లో యూరియా లభ్యత సమాచారం అందుబాటులో ఉంటుంది. సమీప డీలర్ల వద్ద మరియు జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న యూరియా సంచుల వివరాలు చూడొచ్చు.
- ముందస్తు బుకింగ్ సౌకర్యం ఉంటుంది. అవసరమైన పరిమాణాన్ని ముందుగానే బుక్ చేసి, అనుకూలమైన డీలర్ను ఎంపిక చేసుకోవచ్చు.
- బుకింగ్ పూర్తయిన తర్వాత లభించే బుకింగ్ ఐడి చూపించి యూరియా పొందవచ్చు.
- పంట రకం, సాగు చేసిన విస్తీర్ణం ఆధారంగా యూరియా పరిమాణం స్వయంచాలకంగా లెక్కించబడుతుంది.
- ఆధార్ ధృవీకరణతో పాటు భూమి యజమాని వివరాలు నమోదు చేసి కౌలుదారు రైతులు కూడా యూరియా బుక్ చేసుకోవచ్చు.
- సందేహాల కోసం వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) సహాయం అందిస్తారు. హెల్ప్లైన్ను కూడా సంప్రదించవచ్చు.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}