మేడారం వేదికగా తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. ఇందుకోసం మొత్తం కేబినెట్ తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరవుతారు.
మేడారంలోని హారిత హోటల్ లో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మేడారం జాతర వేళ… కేబినెట్ భేటీ విశేషంగా మారింది.
ముఖ్యమంత్రి పర్యటనతో పాటు కేబినెట్ సమావేశం నేపథ్యంలో మేడారంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా ట్లు చేశారు. మునుపెన్నడూ లేనంత భద్రతను ఏర్పాటు చేశారు. సాధారణంగా రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంటోంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో నిర్వహించడం ఇదే తొలిసారి.
కీలక అంశాలపై చర్చ…!
మేడారం వేదికగా జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై వేగంగా కసరత్తు కొనసాగుతోంది. కీలకమైన రిజర్వేషన్ల అంశం కూడా కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ అంశంపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.
ప్రస్తుత రబీ సీజన్లో రైతు భరోసా నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఈ విషయంపై కూడా కేబినెట్ లో చర్చిస్తారని తెలుస్తోంది. అంతేకాకుందా గోదావరి పుష్కరాల నిర్వహణతో పాటు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాజెక్టులపై చర్చించే అకాశం ఉంది. పొట్లపూర్ ఎత్తి పోతల పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలిసింది. అంతేకాకుండా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో…. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
ఇక మేడారంలో జరగబోయే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మేడారంలో శాశ్వత ప్రాతిపాదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీగానే నిధులు కేటాయించారు. అయితే కేబినెట్ భేటీలో మరిన్ని నిధులపై ప్రకటన ఏమైనా ఉంటుందా అనే చర్చ కూడా ఉంటుంది.
{{/usCountry}}ఇక మేడారంలో జరగబోయే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మేడారంలో శాశ్వత ప్రాతిపాదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీగానే నిధులు కేటాయించారు. అయితే కేబినెట్ భేటీలో మరిన్ని నిధులపై ప్రకటన ఏమైనా ఉంటుందా అనే చర్చ కూడా ఉంటుంది.
{{/usCountry}}