...
...
Next Story

Revanth Reddy 1980s trend : '80s వైబ్'లో సీఎం రేవంత్ రెడ్డి - సోషల్ మీడియాలో ఫొటో వైరల్!

Revanth Reddy 1980s trend : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న '80s వైబ్'లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరారు. పాతకాలపు బైక్‌పై వింటేజ్ లుక్‌లో ఉన్న ఆయన ఏఐ చిత్రం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Published on: Sep 10, 2026, 18:20:44 IST
Advertisement

ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న "1980ల నాటి లుక్" ట్రెండ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భాగమయ్యారు. గురువారం రోజున ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో తన ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత వింటేజ్ ఫోటోను పంచుకున్నారు. "జాయినింగ్ 80స్ ట్రెండ్" (Joining 80s trend) అనే క్యాప్షన్‌తో ఆయన ఈ పోస్ట్‌ను నెటిజన్లతో పంచుకున్నారు.

'80s వైబ్'లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
'80s వైబ్'లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఈ చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి 1980ల నాటి క్లాసిక్ మోటార్ బైక్‌పై చాలా సాధారణంగా ఆనుకుని నిలబడి కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ కాలం నాటి పాత సినిమా పోస్టర్లు, వింటేజ్ వాతావరణం పాత రోజులను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. ఈ లుక్ కోసం ఆయన ఆఫ్-వైట్ షర్ట్, ఖాకీ ప్యాంట్, బ్రౌన్ కలర్ కోట్ ధరించి కనిపించారు. ఒక చేతిని కోట్ జేబులో ఉంచుకుని, మరొక చేతిని బైక్‌పై ఉంచి నవ్వుతూ ఉన్న ఆయన శైలి అభిమానులను ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో వైరల్…

ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వేలాది లైకులు, కామెంట్లతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. రేవంత్ రెడ్డి అభిమానులు, వైఆర్సీపీ మరియు కాంగ్రెస్ శ్రేణులు, సాధారణ నెటిజన్లు దీనిపై విస్తృతంగా స్పందిస్తున్నారు. "80ల నాటి లుక్... రేవంత్ అన్నా నీ ఆరా వేరు!" అని ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు కామెంట్ చేయగా…. మరికొందరు ఆయన స్టైల్‌ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks