తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు క్యూలో నిలబడటంతో అనేక గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 11 గంటల నాటికి 52 శాతం ఓటింగ్ నమోదైంది. పట్టణాలు, నగరాల్లో పనిచేస్తున్న చాలా మంది ఓటర్లు తమ ఓటు వేయడానికి స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు, వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

అయితే కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు సమాచారం ఇవ్వకుండానే పెద్ద గోకుల్ తండా వాసులు సర్పంచ్ను ఏకగ్రీవం చేశారని గ్రామస్తులు నిరసనకు దిగారు. ఎన్నికలను బహిష్కరించారు.
పెద్ద గోకుల్ తండా వాసిని వేలం పాట ద్వారా ఏకగ్రీవం చేసుకున్నారని చిన్న గోకుల్ తండా వాసులు చెప్పారు. దీనిని నిరసనగా ఓట్లు వేయకుండానే తండాల్లో ఉండిపోయారు. చిన్న గోకుల్ తండాకు ప్రత్యేక పంచాయతీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నల్గొండ జిల్లా చిట్యాల్ మండలం ఉరుమడ్ల గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కంచెర్ల భూపాల్ రెడ్డి, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు.
కేతేపల్లి మండలం కొర్లపహాడ్లో రెండు వర్గాలు రాళ్లు, కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. నలుగురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తర్వాత, శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసు బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.
జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో డబ్బులు పంచుతున్న అభ్యర్థి పట్టుకున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్న వార్డు అభ్యర్థి రాజును పట్టుకుని రూ.40వేలు స్వాధీనం చేసుకున్నారు.
{{/usCountry}}జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో డబ్బులు పంచుతున్న అభ్యర్థి పట్టుకున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్న వార్డు అభ్యర్థి రాజును పట్టుకుని రూ.40వేలు స్వాధీనం చేసుకున్నారు.
{{/usCountry}}సూర్యాపేట జిల్లా నూతనకల్ మం. మిర్యాలలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న హెడ్కానిస్టేబుల్కు గుండెపోటు వచ్చింది. సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు పోలీసులు. హెడ్కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేటకు తరలించారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 86 సర్పంచ్ పదవులు, కామారెడ్డి జిల్లాలో 78 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవిని రూ.52 లక్షలకు కొనుగోలు చేశారని, ఉప సర్పంచ్ పదవిని రూ.15 లక్షలకు కొనుగోలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చందూర్ మండలంలోని లక్ష్మాపూర్లో కూడా ఇలాంటివి వినిపించాయి. అక్కడ సర్పంచ్ పదవికి రూ.45 లక్షలు, ఉప సర్పంచ్ పదవికి రూ.10 లక్షలు ఖర్చయిందని గ్రామస్తులు చెబుతున్నారు. వీటితోపాటుగా కమ్యునిటీ భవనాలు, భూమి విరాళం లాంటి హామీలు కూడా ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారట.