890 గ్రామల్లో ఏకగ్రీవం.., తొలి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం : ఎస్ఈసీ

మొదటి దశ పోలింగ్‌కు ముందే తెలంగాణలోని 890 గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. తొలి విడత పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.

Published on: Dec 10, 2025 5:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురువారం జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. పోలింగ్ సజావుగా జరిగేలా పోలీసు శాఖ భద్రత, శాంతిభద్రతల చర్యలను చేపట్టిందని అన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మొదటి దశలో 395 గ్రామాలు, రెండో దశలో 495 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలియజేసింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం
రాష్ట్ర ఎన్నికల సంఘం

ఇప్పటివరకు అధికారులు తనిఖీల సమయంలో రూ.8.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 50,000 మంది సివిల్ పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని, భద్రతను పటిష్టం చేయడానికి బయటి నుండి 60 ప్లాటూన్లను రప్పించామని ఎస్ఈసీ రాణి కుముదిని తెలిపారు.

మెుదటి దశ గ్రామ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం చేసినట్టుగా ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. 'తొలి దశలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో ఈ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశాం. ఈ ఎన్నికల్లో విధుల్లో లక్ష మందికిపైగా సిబ్బంది పాల్గొంటారు.' అని ఎస్ఈసీ రాణి కుముదిని పేర్కొన్నారు.

మెుదటి విడత ఎన్నికల్లో భాగంగా 4236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇందులో 5 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. గురువారం 3846 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. మెుత్తం 13,127 మంది సర్పంచ్ అభ్యర్థులో తొలి విడత పోరులో బరిలో ఉన్నారు.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మెుత్తం మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. మెుదటి దశ డిసెంబర్ 11, రెండో దశ డిసెంబర్ 14, డిసెంబర్ 17వ మూడో దశ ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది.