రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు 23 శాతం చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదికకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇప్పటికే పలువురు మంత్రులు సంతకాలు కూడా చేశారు.

ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కలెక్టర్లు దాన్ని పరిశీలించి మండలాలకు పంపించారు. దీని ప్రకారం మండల స్థాయిలో సర్పంచ్లు, వార్డు స్థానాలకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కసరత్తు పూర్తయింది.
బీసీ కోటాలో మార్పు….!
ఇవాళ బీసీ రిజర్వేషన్ల ఖరారు ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఆదివారం నాటికి ఆ జాబితాలను అధికారికంగా ఖరారు చేసి అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి సమర్పిస్తారని తెలుస్తోంది. గతంలో 42 శాతం రిజర్వేషన్లతో కూడిన జీవో ఇవ్వగా… చాలా స్థానాల్లో బీసీలకు అవకాశం దక్కేది. కానీ ప్రస్తుతం 23 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించే పనిలో ఉండగా…… గతంలో ప్రకటించిన కోటాలో మార్పులుంటాయి. ఆయా చోట్ల జనరల్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ కోటాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మరోవైపు ఈనెల 24వ తేదీన హైకోర్టులో పంచాయతీ ఎన్నికలపై విచారణ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన కసరత్తు వివరాలను కూడా న్యాయస్థానం ముందు ఉంచనుంది.
3 దశల్లో ఎన్నికలు…!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. డిసెంబర్ 2 వారంలోని కొన్ని తేదీల్లో పోలింగ్ జరిపేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఈసీ అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఏది ఏమైనా డిసెంబర్ 3 వారం కంటే ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
{{/usCountry}}రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. డిసెంబర్ 2 వారంలోని కొన్ని తేదీల్లో పోలింగ్ జరిపేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఈసీ అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఏది ఏమైనా డిసెంబర్ 3 వారం కంటే ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
{{/usCountry}}ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించే ప్రక్రియ షురూ అయింది. ఈనెల 23 వరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఈనెల 23వ తేదీన ఫైనల్ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుంది.
ఇక రాష్ట్రంలో ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించి… ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే కసరత్తు చేస్తోంది.