Telangana Fee Reimbursement New Rules : గత కొంతకాలం రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల చెల్లింపుల విషయంలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రైవేట్ కాలేజీలు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సర్కార్… కీలక సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఉన్న జీవోను రద్దు చేసి… కొత్త నిబంధనలను అమలు చేయనుంది.

గతంలో మాదిరిగా కాలేజీల ఖాతాలోకి కాకుండా…. విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకే నేరుగా నగదు బదిలీ (Direct Benefit Transfer - DBT) చేయనున్నారు. ఇందుకోసం గతంలో అమలులో ఉన్న జీవో నం.7ను రద్దు చేస్తూ…. కొత్త నిబంధనలతో బోధన ఫీజుల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమశాఖ సరికొత్త ఉత్తర్వులు (జీవో నం.9) జారీ చేసింది. ఈ మార్పులు రాబోయే 2026-27 విద్యాసంవత్సరం నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
ఏడాదంతా దరఖాస్తుల స్వీకరణ..
కొత్త నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థులకు బోధన ఫీజులు, స్కాలర్షిప్ల మంజూరు కోసం ఏడాది పొడవునా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు కొత్తవాటితో పాటు రెన్యువల్ దరఖాస్తులను ఎప్పుడైనా సమర్పించుకోవచ్చు. ఇందుకోసం ఈ-పాస్ (e-PASS) పోర్టల్ ఏడాదంతా తెరిచే ఉంటుంది.
దరఖాస్తు చేయడంలో ఆలస్యం చేసినకొద్దీ ఫీజుల విడుదల కూడా ఆలస్యమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ముందు దరఖాస్తు చేసిన వారికి ముందుగా మంజూరు’విధానాన్ని అవలంబిస్తారు. అలాగే…. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఏడాది ఫీజును ఒకేసారి చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల మంజూరులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలనే ఇకపై రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. ఈ పథకం కింద ఫీజుల మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేసిన వారం రోజుల్లో (7 రోజులు) ఆ నిధులను విద్యార్థులు తాము చదువుతున్న కళాశాలలకు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల పరిశీలన ఇలా:
- ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు : ఈ కాలంలో అందిన దరఖాస్తులను పరిశీలించి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన రాష్ట్ర వాటాను ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేసిన వెంటనే ఆ మొత్తాన్ని కూడా విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారు. ఇక బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు ఆగస్టు 15నే ఒకే విడతగా చెల్లిస్తారు.
- ఆగస్టు 1 నుంచి నవంబరు 30 వరకు : ఈ గడువులో దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబరు 30 నాటికి నిధులు అందుతాయి.
- డిసెంబరు 1 నుంచి జనవరి 31 వరకు : ఈ సమయంలో దరఖాస్తు పూర్తి చేసిన వారికి ఫిబ్రవరి 28న నిధులు విడుదలవుతాయి.
- ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు : విద్యాసంవత్సరం చివర్లో దరఖాస్తు చేసుకున్న వారికి 75 రోజుల్లోగా నిధులను ఖాతాల్లో జమ చేస్తారు.
కొత్త మార్గదర్శకాలు.. నిబంధనలు ఇవే!
2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇకపై ప్రతి ఏటా దరఖాస్తును రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి చేరిన వారికి ఆటోమేటిక్ రెన్యువల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
- ఆదాయ పరిమితి : కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ బోధన ఫీజుల రీయింబర్స్మెంట్కు అర్హులు. అలాగే అభ్యర్థులు కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్నవారైఉండాలి.
- ఆధార్ హాజరు తప్పనిసరి : అన్ని విద్యాసంవస్థలు బయోమెట్రిక్ లేదా ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను పక్కాగా అమలు చేయాలి.
- స్కాలర్షిప్ కావాలంటే విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు 75 శాతం ఉండాల్సిందే.
- ఫీజులు, ఉపకార వేతనాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహించనుంది.
- ఈ-పాస్ పోర్టల్లో విద్యార్థుల సమస్యల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు లేవనెత్తిన సాంకేతిక లేదా ఇతర సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంటుంది.
2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇకపై ప్రతి ఏటా దరఖాస్తును రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి చేరిన వారికి ఆటోమేటిక్ రెన్యువల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
- ఆదాయ పరిమితి : కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ బోధన ఫీజుల రీయింబర్స్మెంట్కు అర్హులు. అలాగే అభ్యర్థులు కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్నవారైఉండాలి.
- ఆధార్ హాజరు తప్పనిసరి : అన్ని విద్యాసంవస్థలు బయోమెట్రిక్ లేదా ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను పక్కాగా అమలు చేయాలి.
- స్కాలర్షిప్ కావాలంటే విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు 75 శాతం ఉండాల్సిందే.
- ఫీజులు, ఉపకార వేతనాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహించనుంది.
- ఈ-పాస్ పోర్టల్లో విద్యార్థుల సమస్యల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు లేవనెత్తిన సాంకేతిక లేదా ఇతర సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంటుంది.