ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ : స్లాబ్ సైజులపై పరిమితులు - కొత్త రూల్స్ ఇవే
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్లాబ్ సైజు, విస్తీర్ణానికి సంబంధించి గృహనిర్మాణ శాఖ కీలక జీవో జారీ చేసింది. లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదల గృహనిర్మాణ పథకం ‘ఇందిరమ్మ ఇళ్లు’నిబంధనలపై హౌసింగ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ సైజు మరియు దాని పొడిగింపు (ప్రొజెక్షన్) విస్తీర్ణాన్ని పరిమితం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా నిబంధనలు ఇలా….
నూతన ఉత్తర్వుల ప్రకారం….. నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల శ్లాబ్ వైశాల్యం కేవలం 500 నుంచి 750 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్లాబ్ పరిమాణం పెరగడం వల్ల లబ్ధిదారులకు అదనపు నిర్మాణ ఖర్చులు భారీగా పెరుగుతున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. పేద లబ్ధిదారులపై ఈ ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ శ్లాబ్ విస్తీర్ణ పరిమితిని విధిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
స్లాబ్ ప్రొజెక్షన్ (సజ్జాలు/ముందు భాగం) విషయంలోనూ స్పష్టమైన నిబంధనలు ఖరారు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో శ్లాబ్ ముందువైపు గరిష్టంగా 3 అడుగులు, అలాగే మిగతా మూడు వైపులా కేవలం ఒక అడుగు మాత్రమే ప్రొజెక్షన్ ఉండాలని గృహనిర్మాణ శాఖ స్పష్టం చేసింది.
నిర్మాణ వ్యయాన్ని నియంత్రణలో ఉంచేందుకు, నిర్దేశిత బడ్జెట్ పరిమితిలోనే ఇళ్లు పూర్తి అయ్యేలా చూసేందుకు ఈ కొలతలను తప్పనిసరి చేసినట్లు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ తెలిపింది. క్షేత్రస్థాయి అధికారులు ఈ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు జరిగేలా పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద సొంతగా ఇంటి స్థలం ఉన్నవారు గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొదటి విడతలో భాగంగా సుమారు లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తికాగా.. మరో లక్ష ఇండ్లు ఈ సెప్టెంబర్ నెల నాటికి పూర్తవుతాయని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు రెండో విడతలో ఇండ్ల కేటాయింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న చాలా నిర్మాణాల్లో…. చాలా మంది లబ్ధిదారులు స్లాబ్ ఎక్కువ సైజులో నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది గోడల కన్నా సుమారు 8 అడుగుల వరకు ముందుకొస్తున్నారు. ఫలితంగా పెద్ద శ్లాబు నిర్మించడం కారణంగా ఖర్చు పెరుగుతోంది. ఈ ప్రభావం పేదలకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది. మరికొన్ని కారణాలను కూడా పరిగణనలోకి తీసుకోవటంతో ….. శ్లాబ్ విస్తీర్ణంపై పరిమితులు విధించాలని హౌసింగ్ కార్పొరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. దీనికి అనుగుణంగా… ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

