TG Employee Health Care Trust : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)ను పక్కాగా…. పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.

ఈ నూతన ఆరోగ్య భద్రత పథకం అమలు తీరు, కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉద్యోగులకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ సమీక్ష సాగనుంది.
ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే ‘ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్’ ద్వారా నిరంతరాయంగా నిర్వహించనుంది. ఉద్యోగులు, పెన్షనర్ల భాగస్వామ్యంతోనే ఈ ట్రస్ట్ పని చేయనుంది.
హెల్త్ కేర్ ట్రస్ట్ నిర్మాణం ఇలా..
ఈ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులను, పెన్షనర్ల సంఘాల నుంచి ఇద్దరు ప్రతినిధులను సభ్యులుగా నియమిస్తారు. తద్వారా లబ్ధిదారుల సమస్యలను ఎప్పటికప్పుడు ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది.
ఈ ట్రస్ట్ కార్యకలాపాలను, పరిపాలనను పర్యవేక్షించడానికి ఒక సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా ప్రభుత్వం నియమించనుంది. ఈ బోర్డు మెంబర్ల వివరాలతో కూడిన అధికారిక జీవోను, కమిటీని రేపే (సోమవారం) ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
నేటితో ముగియనున్న డేటా సేకరణ గడువు
ఈ ఆరోగ్య పథకం క్షేత్రస్థాయిలో విజయవంతం కావడానికి అవసరమైన లబ్ధిదారుల వివరాల సేకరణ ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు), వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఖచ్చితమైన వివరాలను సేకరించాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు కీలకమైన సర్క్యులర్ను జారీ చేసింది.
{{/usCountry}}ఈ ఆరోగ్య పథకం క్షేత్రస్థాయిలో విజయవంతం కావడానికి అవసరమైన లబ్ధిదారుల వివరాల సేకరణ ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు), వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఖచ్చితమైన వివరాలను సేకరించాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు కీలకమైన సర్క్యులర్ను జారీ చేసింది.
{{/usCountry}}ఈ సర్క్యులర్ ప్రకారం…. మే 31 (ఇవాళ) లోపు అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్ల అందరి డేటాను నిర్దేశిత పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. ఈ విధంగా సేకరించిన పూర్తి డేటాబేస్ ఆధారంగానే లబ్ధిదారులందరికీ అత్యాధునిక 'డిజిటల్ హెల్త్ కార్డులు' జారీ చేస్తారు. ఈ కార్డుల ద్వారా రాష్ట్రంలోని గుర్తింపు పొందిన అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా 'క్యాష్లెస్' అత్యుత్తమ చికిత్స సేవలు అందేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.