బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించే పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.

రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేయడం ఈ పథకం ప్రత్యేకత.
ఆగస్టు 13, 2026 గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు హైదరాబాద్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని జీ-29లో ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. కుట్టు వృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించడంతో పాటు, వారి ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని ఆర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పథకం విధి విధానాలు, కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగస్టు 13న నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించనున్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు.బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తూ, మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేసే దిశగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కీలక ముందడుగుగా నిలవనుంది.
{{/usCountry}}ఈ కార్యక్రమంలో బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు.బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తూ, మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేసే దిశగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కీలక ముందడుగుగా నిలవనుంది.
{{/usCountry}}