...
...
Next Story

3 దశల్లో పంచాయతీ ఎన్నికలు - ఈ నెలఖారులోనే షెడ్యూల్...!

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నగారా మోగే అవకాశం ఉంది. ఓవైపు ఎన్నికల నిర్వహణపై కసరత్తు జరుగుతుండగా… షెడ్యూల్ విడుదలపై కూడా కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈనెలాఖారులోపే షెడ్యూల్ రావొచ్చని తెలుస్తోంది.

Published on: Nov 21, 2025, 11:33:02 IST
Advertisement

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు వేగవంతమవుతోంది. ఈనెలఖారులోపే షెడ్యూల్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా తేదీలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3 వారంలోపే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండగా… ఈ నెల 25 లేదా 26 తేదీల్లో షెడ్యూల్ ప్రకటించే యోచనలో ఉంది.

3 దశల్లో ఎన్నికలు…!

పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ ఎన్నికలు

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇవాళ పూర్తిస్థాయిలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ సూచనల మేరకు ఈసీ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. డిసెంబర్ 2 వారంలోని కొన్ని తేదీల్లో పోలింగ్ జరిపేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఈసీ అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఏది ఏమైనా డిసెంబర్ 3 వారం కంటే ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు ఈనెల 24వ తేదీన హైకోర్టులో స్థానిక ఎన్నికలపై విచారణ జరగనుంది. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతినిస్తే… పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు లైన్ క్లియర్ అయిపోతుంది. ఇక ఈసీ ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలపై ఇవాళ ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించే ప్రక్రియ షురూ అయింది. ఈనెల 23 వరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఇవాళ ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ఉంటుంది. ఇక ఈనెల 23వ తేదీన ఫైనల్ ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల ప్రచురణ ఉంటుంది.

ఇక రాష్ట్రంలో ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించి… ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే కసరత్తు చేస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe