గ్రూప్-1పై తీర్పు వచ్చేనెల 5కు వాయిదా వేసింది హైకోర్టు. తీర్పు ఇంకా రెడీ కాలేదని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. గ్రూప్-1 పై ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వచ్చేనెల 5కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుతో 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం తేలనుంది.

కిందటి నెలలో సంబంధిత పిటిషన్లపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈరోజుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తీర్పు ఇంకా రెడీ కాలేదని.. ఫిబ్రవరి 5వ తేదీ వాయిదా వేసింది హైకోర్టు. 2024 అక్టోబర్లో నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మార్చి 10వ తేదీన వెల్లడించిన తుది మార్కుల జాబితా, మార్చి 30వ తేదీన ప్రకటించన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు.
అంతేకాదు గ్రూప్ 1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత ఫలితాలను ప్రకటించాలని కమిషన్ను ఆదేశించింది కోర్టు. ఒకవేళ ఇది సాధ్యంకాకపోతే.. మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ సవాల్ చేసింది. పలువురు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన సీజే ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది.
టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్షలు జరిగాయని కోర్టుకు తెలిపారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకుండా చూశారన్నారు. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం హాల్టికెట్లను వేర్వేరుగా జారీ చేసినట్టుగా వెల్లడించారు. పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
{{/usCountry}}టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్షలు జరిగాయని కోర్టుకు తెలిపారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకుండా చూశారన్నారు. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం హాల్టికెట్లను వేర్వేరుగా జారీ చేసినట్టుగా వెల్లడించారు. పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
{{/usCountry}}ఈ గ్రూప్ 1పై ఈరోజు తీర్పు వెలువడుతుందని అంతా అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 5వ తేదీకి తీర్పు వాయిదా పడింది. ఇప్పటికే 563 మంది అభ్యర్థుల అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్నారు. కోర్టు తీర్పు ఏం ఇస్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.