గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన నిర్ణయాన్ని కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఉపశమనం కలుగుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను 2024 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించింది. అయితే సిద్దిపేట శివనగర్కు చెందిన కె. పరుశరాములు, ఇతరులతో కలిసి మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, న్యాయ విచారణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.

పిటిషన్లను విచారించిన తర్వాత సింగిల్ జడ్జి బెంచ్ మార్చి 10న జారీ చేసిన తుది మార్కుల జాబితాను, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేసింది. అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి కొత్త ఫలితాలను ప్రకటించాలని కూడా టీజీపీఎస్సీని ఆదేశించింది. తిరిగి మూల్యాంకనం సాధ్యం కాకపోతే.. పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని ఆదేశించింది.
ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టీజీపీఎస్సీ, అనేక మంది గ్రూప్-1 అభ్యర్థులు డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసుకున్నారు. ఇప్పుడు తుది తీర్పును వెలువడింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది హైకోర్టు.
నిజానికి జనవరిలోనే తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ తీర్పు రెడీ కాలేదని హైకోర్టు చెప్పింది. ఫిబ్రవరి 5వ తేదీ వాయిదా వేసింది హైకోర్టు. దానిప్రకారం తాజాగా తీర్పు వెల్లడించింది. 2024 అక్టోబర్లో నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మార్చి 10వ తేదీన వెల్లడించిన తుది మార్కుల జాబితా, మార్చి 30వ తేదీన ప్రకటించన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు.
అంతేకాదు గ్రూప్ 1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత ఫలితాలను ప్రకటించాలని కమిషన్ను ఆదేశించింది కోర్టు. ఒకవేళ ఇది సాధ్యంకాకపోతే.. మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ సవాల్ చేసింది. పలువురు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన సీజే ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది.
{{/usCountry}}అంతేకాదు గ్రూప్ 1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత ఫలితాలను ప్రకటించాలని కమిషన్ను ఆదేశించింది కోర్టు. ఒకవేళ ఇది సాధ్యంకాకపోతే.. మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ సవాల్ చేసింది. పలువురు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన సీజే ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది.
{{/usCountry}}గతంలో టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది సుదర్శన్రెడ్డి వాదనలు సందర్భంగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్షలు జరిగాయని కోర్టుకు తెలిపారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకుండా చూశారన్నారు. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం హాల్టికెట్లను వేర్వేరుగా జారీ చేసినట్టుగా వెల్లడించారు. పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.