రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ డిస్మిస్ చేయటాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం…. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది.

దానం పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్ తీర్పును కొట్టేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్లో ప్రస్తావించారు. బీఆర్ఎస్ నుంచి గెలవటమే కాకుండా… కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని తెలిపారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజు నుంచే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.
ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు…. కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్కు నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో మరోసారి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు తెరపైకి వచ్చినట్లు అయింది.
అసలేం జరిగిందంటే..?
బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరానని స్పీకర్ కు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా కోర్టులను కూడా బీఆర్ఎస్ ఆశ్రయించింది. ఈ అనర్హత పిటిషన్లపై విచారించిన స్పీకర్… ఇటీవలనే తీర్పు ప్రకటించారు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారని… పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీలు మారినట్టుగా కూడా ఆధారాలు లేవని చెబుతూ…అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, ప్రకాష్గౌడ్, అరికెపూడి గాంధీ, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్కుమార్, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఉన్నారు.
{{/usCountry}}ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, ప్రకాష్గౌడ్, అరికెపూడి గాంధీ, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్కుమార్, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఉన్నారు.
{{/usCountry}}అయితే వీరిలో దానం నాగేందర్…. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫారమ్ పై సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ… బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు ఎమ్మెల్యే దానంను టార్గెట్ చేస్తున్నారు. దానంపై అనర్హత పిటిషన్ వేసిన వాళ్లలో ఒక్క బీఆర్ఎస్ మాత్రమే కాకుండా… బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి కూడా ఉన్నారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ… ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు… దానంకు నోటీసులు ఇచ్చింది.