తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రెండు కీలక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల అమలును రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది. ప్రశస్త్(PRASHAST), స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ 2026(SHVR) పేరిట చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రశస్త్ యాప్ ద్వారా దివ్యాంగత్వ గుర్తిస్తారు. ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో వైకల్యాల ముందస్తు సంకేతాలను గుర్తించనున్నారు. యూడైస్ ప్లస్లో ఉన్న దాదాపు 3.65 లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ యాప్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. NCERT/CIET అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ద్వారా దివ్యాంగుల హక్కుల చట్టం-2016(RPwD Act) గుర్తించిన 21 రకాల వైకల్యాల లక్షణాలను ఉపాధ్యాయులు గుర్తిస్తారు.
ఉపాధ్యాయులందరూ ప్రశస్త్ యాప్ లేదా పోర్టల్ ద్వారా ఆగస్టు 31 లోపు అవగాహన మాడ్యూల్స్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా రెగ్యులర్ టీచర్లు పిల్లల ప్రవర్తన, శారీరక లక్షణాలను స్క్రీనింగ్ చేస్తారు. అవసరమైన చోట స్పెషల్ ఎడ్యుకేటర్లు దీనిని ధృవీకరిస్తారు. ఇది వైద్యపరమైన రోగనిర్ధారణ కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రాథమిక గుర్తింపు వ్యవస్థ మాత్రమేనని తెలిపింగది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పరిశుభ్రత, పచ్చదనంపై స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ను పకడ్బందీగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ చెప్పారు. పాఠశాలల్లో పారిశుధ్యం, పర్యావరణ పద్ధతులను మెరుగుపరిచేందుకు ఈ మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలోని 42,082 పాఠశాలలు పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకుని.. సెల్ఫ్ అసెస్మెంట్నుసెప్టెంబర్ 30, 2026లోపు కంప్లీట్ చేయాలి. మంచి మంచినీటి సౌకర్యాలు, పారిశుధ్యం, చెత్త నిర్వహణ, పచ్చదనం నిర్వహణ వంటి చర్యలపై రేటింగ్ ఇస్తారు.
{{/usCountry}}రాష్ట్రంలోని 42,082 పాఠశాలలు పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకుని.. సెల్ఫ్ అసెస్మెంట్నుసెప్టెంబర్ 30, 2026లోపు కంప్లీట్ చేయాలి. మంచి మంచినీటి సౌకర్యాలు, పారిశుధ్యం, చెత్త నిర్వహణ, పచ్చదనం నిర్వహణ వంటి చర్యలపై రేటింగ్ ఇస్తారు.
{{/usCountry}}ఈ రెండు కార్యక్రమాల సమర్థవంతమైన అమలు ద్వారా బడిపిల్లల్లో ఉన్న శారీరక, మానసిక లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి తగిన ఉపశమనం అందించడంతో పాటు, బడుల్లో మెరుగైన పరిశుభ్రత, హరిత వాతావరణం ఏర్పడుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.