ఒక్క రోజులోనే హైదరాబాద్లోని ఫేమస్ ప్లేసులను చూడాలనుకుంటున్నారా…? అతి తక్కువ టికెట్ ధరతోనే ఈ అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ టూరిజం. టూరిస్టుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. సిటీ మొత్తం కవర్ చేసేలా ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఈ టూర్ ప్యాకేజీ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా బిర్లా మందిర్, చౌమహాల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్లో షాపింగ్ సహా ఇతర ప్రదేశాలు ఎంజాయ్ చేయవచ్చు. నిజాం జూబ్లీ పెవిలియన్, గొల్కోండ ఫోర్ట్, కుతుబ్ షాహీ టూంబ్స్, లుంబినీ పార్క్ కవర్ అవుతాయి. ఏసీ, నాన్ఏసీ బస్సుల ద్వారా ప్రయాణం ఉంటుంది. https://tgtdc.in/ వెబ్ సైట్ ద్వారా ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.
జర్నీ షెడ్యూల్ వివరాలు….
- ఉదయం 7:30 గంటలకు సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట యాత్రి నివాస్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది.
- 7:45 గంటలకు పర్యాటక భవన్ దగ్గర ఎక్కొచ్చు.
- 8:15 గంటలకు బషీర్బాగ్ CRO ఆఫీస్ దగ్గర కూడా బోర్డింగ్ పాయింట్ ఉంటుంది.
- ముందుగా బిర్లా మందిర్ ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత చౌమహాల్లా ప్యాలెస్(శుక్రవారం ఉండదు), చార్మినార్, మక్కా మసీద్ సందర్శిస్తారు. లడ్ బజార్ లో షాపింగ్ చేసుకోవచ్చు.
- ఆ తర్వాత సలార్ జంగ్ మ్యూజియం వెళ్తారు. శుక్రవారం మాత్రం క్లోజ్ ఉంటుంది. అక్కడ్నుంచి నిజాం జూబ్లీ పెవిలియన్ వెళ్తారు. అక్కడ్నుంచి జూపార్క్ సందర్శిస్తారు.
- గొల్కోండ ఫోర్ట్, కుతుబ్ షాహీ టూంబ్స్ చూస్తారు.
- చివరగా ఐమ్యాక్స్(ఖైరతాబాద్) మీదుగా చివరగా లుంబినీ పార్క్ దగ్గర రాత్రి 7:30 గంటలకు వదిలేస్తారు. దీంతో మీ వన్ డే ట్రిప్ పూర్తవుతుంది.
హైదరాబాద్ సిటీ వన్ డే ట్రిప్ ధరలు చూస్తే…. రెగ్యూలర్ ఛార్జీలు(ఏసీ కోచ్) అయితే పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.440గా నిర్ణయించారు. బోటింగ్ అయితే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫుడ్, సందర్శన స్థలాల వద్ద ఎంట్రీ టికెట్లు టూరిస్టులే తీసుకోవాలి. నియమ, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.