77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిందన్నారు. ఈ డాక్యుమెంట్ హైదరాబాద్ ఇమేజ్ను మరింత పెంచుతుందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా మారాలనే తెలంగాణ దార్శనికత.. వికసిత్ భారత్కు అనుగుణంగా ఉందన్నారు గవర్నర్.

'2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకోవాలని వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పత్రాన్ని గత ఏడాది డిసెంబరులో ప్రపంచ నాయకులు, పెట్టుబడిదారుల సమక్షంలో ఆవిష్కరించారు. విజన్ 2047 డాక్యుమెంట్లో మూడు జోన్లు ఉన్నాయి. క్యూర్, ప్యూర్, రేర్. 2047 నాటికి భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని వికసిత్ భారత్ భావిస్తోంది. ఈ జాతీయ దృక్పథానికి అనుగుణంగా తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇది దేశ మొత్తం వృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది. ఈ ఆకాంక్షను సాధించడానికి తెలంగాణ రైజింగ్ - విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించారు.' అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు.
తెలంగాణ చరిత్రలో తొలిసారిగా మేడారం జాతరలో మంత్రివర్గ సమావేశం జరిగిందని, ఆదివాసి ఉత్సవాలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలనే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని గవర్నర్ చెప్పారు. మేడారం అభివృద్ధి కోసం రూ.251 కోట్లు కేటాయించినట్టుగా తెలిపారు. రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. గతేడాది బతుకమ్మ వేడుకలు గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాయన్నారు. 26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసినట్టుగా చెప్పారు. ధాన్యానికి బోనస్గా రైతులకు రూ.1780 కోట్లు అందజేశామన్నారు.
'భూ వివాదాలను పరిష్కరించేందుకు భూ భారతి చట్టం తీసుకొచ్చాం. గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. ఇప్పటివరకు 62 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్లుగా మార్చి, తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నాం.' అని గవర్నర్ వెల్లడించారు.
{{/usCountry}}'భూ వివాదాలను పరిష్కరించేందుకు భూ భారతి చట్టం తీసుకొచ్చాం. గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. ఇప్పటివరకు 62 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్లుగా మార్చి, తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నాం.' అని గవర్నర్ వెల్లడించారు.
{{/usCountry}}