రాష్ట్రంలో కొత్త వైన్స్ షాపుల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు శనివారమే ముగియగా… అధికారులు కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎక్సైజ్శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈనెల 27వ తేదీన డ్రా

బీసీ బంద్తో పాటు బ్యాంకుల బంద్లతో దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు గడువును పొడిగించారు. మరోవైపు ముందుగా ప్రకటించిన విధంగా అక్టోబర్ 23వ తేదీన జరగాల్సిన డ్రా ప్రక్రియ వాయిదా పడింది. ఈనెల27వ తేదీన జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి షాపులను కేటాయిస్తారు.
కొత్త వైన్స్ టెండర్ల కోసం సెప్టెంబర్ 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అయితే అనుకున్నంతగా స్పందన లేకపోవటంతో… ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతూ వచ్చింది. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా…. శనివారం నాటికి 90 వేల లోపు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. శుక్ర, శనివారాల్లో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి.
గడువు పొడిగించటంతో మరికొన్ని దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గత ఏడాది మద్యం దుకాణాల కోసం ఏకంగా 1.31 లక్షల దరఖాస్తులు రాగా… ఈసారి అనుకున్నంత స్థాయిలో మాత్రం స్పందన కనిపించలేదు.దరఖాస్తు ఫీజు(రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు) పెంపు నిర్ణయం దరఖాస్తులపై పడినట్లు కనిపిస్తోంది.
దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత…. అక్టోబర్ 27న కొత్త మద్యం షాపుల కేటాయింపునకు డ్రా తీస్తారు. డ్రా లో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి విడత చెల్లింపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని 6 విడతలుగా చెల్లించుకోవచ్చు.
{{/usCountry}}దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత…. అక్టోబర్ 27న కొత్త మద్యం షాపుల కేటాయింపునకు డ్రా తీస్తారు. డ్రా లో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి విడత చెల్లింపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని 6 విడతలుగా చెల్లించుకోవచ్చు.
{{/usCountry}}కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి ఉంటుంది. డ్రా పద్ధతిలో ఎంపికైన వారు… డిసెంబర్ 1వ తేదీ నుంచి దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చు.