అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. భౌతికకాయాన్ని రప్పించేందుకు విరాళాల సేకరణ!

అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి మరణించారు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన అరుణ్.. అనారోగ్యంతో మృతిచెందారు.

Published on: Jun 22, 2026, 17:45:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉన్నత చదువులు చదివి, కుటుంబానికి అండగా నిలవాలని అమెరికా వెళ్లిన ఒక తెలుగు విద్యార్థి అక్కడ ఆకస్మికంగా మరణించారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెందుల అమెరికాలో కన్నుమూశారు. ఈ విషాదకర ఘటన స్థానిక బంధువులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

అరుణ్ సాయి
అరుణ్ సాయి

ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అరుణ్ సాయి రెడ్డి చిత్రంతో కూడిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అరుణ్ సాయి రెడ్డి తన చదువు పూర్తి చేసుకుని ప్రస్తుతం అమెరికాలో STEM OPT (Science, Technology, Engineering, and Math Optional Practical Training) కాలపరిమితిలో ఉన్నాడు. తన స్వగ్రామం మహబూబ్‌నగర్ నుండి ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఆయన, తన కుటుంబానికి మెరుగైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించేవాడు. ప్రస్తుతం ఆయన అక్కడ ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్న తరుణంలో ఈ ఘోరం జరిగిపోయింది. అనారోగ్యంతో సాయి రెడ్డి మరణించారు.

ఫ్లోరిడాలోని టెంపా నగరంలో ఉంటూ ఉద్యోగం కోసం చూస్తున్న అరుణ్ సాయికి ఇలా జరిగింది. అతడి అకాల మరణం కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. అరుణ్ సాయి రెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. కన్నకొడుకు ఇక లేడనే నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ కష్టసమయంలో అరుణ్ భౌతిక కాయాన్ని భారతదేశానికి, ఆయన స్వగ్రామానికి తరలించేందుకు, బాధిత కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రవాస భారతీయులు ఒక విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇటీవలి కాలంలో అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న భారతీయ, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ఒత్తిడి, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. STEM OPT కాలంలో ఉద్యోగ అన్వేషణ లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించడానికి విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్కడకు వెళ్లినవారు అమెరికాలోని స్థానిక తెలుగు సంఘాలు, భారత ఎంబసీ, స్నేహితులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండటం అత్యవసరం.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More