విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ ఫేజ్-2 వెబ్ ఆప్షన్లకు మిగిలింది ఒక్కరోజే! సీటు సాధించాలంటే ఇలా చేయండి

TG DOST Phase 2 Web Options Last Date 2026 : తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అలర్ట్. ఎందుకంటే తెలంగాణ దోస్త్ రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 25తో ముగిసింది. మే 26తో వెబ్ఆప్షన్స్ కూడా ముగుస్తాయి.

Published on: May 25, 2026, 21:09:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో (BA, B.Com, B.Sc, BBA, BCA మొదలైనవి) ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న 'దోస్త్' (Degree Online Services, Telangana - TG DOST) రెండో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. రెండో విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి మే 26, 2026 (మంగళవారం) ఆఖరి తేదీ.

తెలంగాణ దోస్త్ ఫేజ్ 2 షెడ్యూల్
తెలంగాణ దోస్త్ ఫేజ్ 2 షెడ్యూల్

ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి సూచించింది.

ముఖ్యమైన తేదీలు

  • ఫేజ్-2 వెబ్ ఆప్షన్ల ఆఖరి తేదీ: మే 26, 2026
  • ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ (PH/CAP/NCC/Sports): మే 26, 2026
  • రెండో విడత సీట్ల కేటాయింపు : మే 30, 2026
  • ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : మే 31 నుండి జూన్ 5, 2026 వరకు

వెబ్ ఆప్షన్లు ఎలా ఇచ్చుకోవాలి?

  • మొదట దోస్త్ అధికారిక వెబ్‌సైట్ dost.cgg.gov.in ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో ఉన్న 'Candidate Login' పై క్లిక్ చేయండి.
  • మీ DOST ID, PIN నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  • ఆ తర్వాత 'Web Options' లింక్‌ను ఎంచుకోండి.
  • మీ ప్రాధాన్యతను బట్టి యూనివర్సిటీ, కాలేజీ, కోర్సులను సెలెక్ట్ చేసుకోండి.
  • ఆప్షన్ల ప్రాధాన్యత క్రమాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాతే 'Save' బటన్ నొక్కండి.

వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు

కేవలం ఒకటి రెండు కాలేజీలను మాత్రమే ఎంచుకుని వదిలేయకండి. వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇస్తే సీటు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. మీకు అత్యంత ఇష్టమైన, ఉత్తమమైన కాలేజీని 'ఆప్షన్ 1' గా, ఆ తర్వాతి స్థానాల్లో మిగిలిన కాలేజీలను ఎంచుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికే ఆప్షన్లు సేవ్ చేసి ఉంటే మే 26 లోపు వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

దోస్త్ రెండో విడతలో రిజిస్ట్రేషన్ చేసుకుని, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు మే 30న సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన విద్యార్థులు మే 31 నుంచి జూన్ 5 లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయని పక్షంలో వారికి దక్కిన సీటు రద్దవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గడువు లోపల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

మొదటి విడతలో సీటు వచ్చి, అంతకంటే మంచి కాలేజీ కోరుకునే వారు కూడా ఈ ఫేజ్-2 లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఫేజ్-2 లో సీటు వస్తే పాత సీటు ఆటోమేటిక్‌గా రద్దవుతుందని గమనించాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More