TG EAPCET 2026 Final Phase Counselling : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ అందుబాటులో ఉంది. అయితే ఈ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి ఇచ్చిన గడువు నేటితో(ఆగస్ట్ 2) ముగియనుంది.
ఆగస్టు 5న సీట్ల కేటాయింపు

టీజీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం… తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను ఆగస్టు 5 నాటికి పూర్తి చేసి, ఫలితాలను అధికారిక వెబ్సైట్లో వెల్లడిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7వ తేదీ మధ్య ఆన్లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం , అప్డేట్స్ కోసం https://tgeapcet.nic.in/default.aspx అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
ఈ ఆఖరి విడత కౌన్సెలింగ్లో పాల్గొంటున్న అభ్యర్థులకు ప్రవేశాల కమిటీ అధికారులు అత్యంత ముఖ్యమైన సూచన చేశారు. ఈ విడత కౌన్సెలింగ్లో సీటు పొందిన తర్వాత, ఏదైనా కారణంతో ఆ సీటును రద్దు చేసుకుంటే.. అప్పటికే చెల్లించిన ట్యూషన్ ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వరని (నో రీఫండ్) అధికారులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఖచ్చితంగా చేరడానికి ఆసక్తి ఉన్న కళాశాలలు, కోర్సులను మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
TG EAPCET చివరి విడత కౌన్సెలింగ్ - తేదీలు
- ఆగస్టు 2 చివరి తేదీ : విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సుల కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
- ఆగస్టు 5 నాటికి : మూడో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి, ఫలితాలను వెల్లడిస్తారు.
- ఆగస్ట్ - ఆగస్ట్ 7వ తేదీ : ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి.
- ఆగస్ట్ 7 వరకు : కాలేజీలో రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://tgeapcet.nic.in/default.aspx