TG EAPCET 2026 Keys : తెలంగాణ ఎప్సెట్ అభ్యర్థులకు అలర్ట్ - ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల, అభ్యంతరాలకు గడువు ఇదే
TG EAPCET 2026 Preliminary Keys : తెలంగాణ ఎప్సెట్ (TG EAPCET) 2026 అగ్రికల్చర్, ఇంజినీరింగ్ విభాగాల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. అభ్యంతరాల నమోదుకు మే 13, 14 తేదీల వరకు అవకాశం కల్పించారు.
TG EAPCET 2026 Preliminary Keys : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్సెట్ (TG EAPCET) 2026కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. సోమవారంతో ఇంజినీరింగ్ పరీక్షలు విజయవంతంగా ముగియగా.... పరీక్షా విభాగం వెనువెంటనే అగ్రికల్చర్, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన ప్రాథమిక కీ (Preliminary Key) తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. వీటిని అధికారిక వెబ్సైట్(eapcet.tsche.ac.in)లో చెక్ చేసుకోవాలని సూచించింది.

భారీగా హాజరైన విద్యార్థులు….
ఈ ఏడాది ఇంజినీరింగ్ పరీక్షలను మొత్తం ఆరు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,97,241 (దాదాపు 93.5%) మంది పరీక్షకు హాజరైనట్లు పరీక్ష కన్వీనర్ విజయకుమార్రెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి విద్యార్థుల హాజరు శాతం ఆశాజనకంగా ఉందని అధికారులు భావిస్తున్నారు.
కీ, అభ్యంతరాల నమోదు వివరాలు
పరీక్ష రాసిన అభ్యర్థులు eapcet.tsche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి. వారి రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి వెబ్సైట్ నుంచి రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రాథమిక కీలను కూడా పొందొచ్చు.
- అగ్రికల్చర్ విభాగం: ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు మే 13వ తేదీ ఉదయం 11:30 గంటల వరకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
- ఇంజినీరింగ్ విభాగం: ఇంజినీరింగ్ కీపై అభ్యంతరాలను మే 14వ తేదీ ఉదయం 11:00 గంటల వరకు పంపేందుకు అవకాశం కల్పించారు.
- నిర్దేశించిన గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యంతరాలను సమర్పించేటప్పుడు సరైన ఆధారాలను (Supporting Documents) జత చేయడం తప్పనిసరి.
టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు ఎప్పుడు?
ప్రాథమిక కీపై వచ్చే అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం తుది కీని సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మరో 10 రోజుల్లోనే తెలంగాణ ఎప్సెట్ - 2026 తుది ఫలితాలను విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. జూన్ మొదటి వారంలోపే ర్యాంకుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

