TG EAPCET 2026 Counselling : బైపీసీ విద్యార్థులకు అలర్ట్ - నేటి నుంచే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం, ముఖ్య తేదీలివే

TG EAPCET 2026 Bipc Stream Counseling : టీజీ EAPCET బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం(నేటి) నుంచి ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా బీ-ఫార్మసీ, ఫార్మా-డీ, బయో-టెక్నాలజీ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. 

Published on: Sep 12, 2026, 11:38:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG EAPCET 2026 Bipc Stream Counseling : ఇంటర్‌మీడియట్‌లో బైపీసీ పూర్తి చేసి… టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. రాష్ట్రంలోని బి-ఫార్మసీ, ఫార్మా-డీ, ఇతర సాంకేతిక, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఈరోజే (శనివారం) ప్రారంభమైంది.

తెలంగాణ ఈఏపీసెట్ - 2026
తెలంగాణ ఈఏపీసెట్ - 2026

నేటి నుంచే రిజిస్ట్రేషన్లు - ముఖ్య తేదీలు

  • ప్రాసెస్ ఫీజు, స్లాట్ బుకింగ్ : ఈ నెల 12 నుంచి 16 వరకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ (https://tgeapc etb.nic.in) ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవచ్చు.
  • ధ్రువపత్రాల పరిశీలన: స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది.
  • వెబ్ ఆప్షన్లు : సర్టిఫికెట్ల సర్టిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు ఈ నెల 16 నుంచి 20 వరకు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
  • సీట్ల కేటాయింపు : మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 22న లేదా ఆలోగా ప్రకటిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://tgeapcetb.nic.in/Default.aspx

కన్వీనర్ కోటా కింద బైపీసీ అభ్యర్థులకు మొత్తం ఐదు రకాల విభిన్న కోర్సులలో ప్రవేశాలు లభిస్తాయి. వివిధ కోర్సుల వారీగా అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలిలా ఉన్నాయి…

  • బి-ఫార్మసీ (B.Pharmacy) : 124 కళాశాలల్లో మొత్తం 8,473 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఫార్మా-డీ (Pharm-D) : 72 కళాశాలల్లో 1,567 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • బీటెక్ బయో-టెక్నాలజీ (B.Tech Bio-Technology): 6 కళాశాలల్లో 239 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ (Pharmaceutical Engineering): 4 కళాశాలల్లో 170 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • బీటెక్ బయో-మెడికల్ (B.Tech Bio-Medical Engineering): 2 కళాశాలల్లో 37 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రత్యేక రిజర్వేషన్ వర్గాల కౌన్సెలింగ్ ఎన్సీసీ (NCC), స్పోర్ట్స్ (Sports), దివ్యాంగులు (PHC), మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు వంటి కేటగిరీలకు చెందిన విద్యార్థులకు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ సైన్స్ కళాశాలలో ప్రత్యేకంగా ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.

వీరికి సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు నిర్ణీత స్లాట్ల ప్రకారం కౌన్సెలింగ్ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా తమకు నచ్చినన్ని వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని, చివరి నిమిషం దాకా వేచిచూడకుండా నిర్దేశిత గడువులోగా స్లాట్ బుకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని కన్వీనర్ సూచించారు.

ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 26న సర్టిఫికెట్ల పరిశీలన, సెప్టెంబర్ 26,27 తేదీలలో ఆప్షన్ ఎంట్రీ జరుగుతాయి. తుది దశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 29న లేదా అంతకంటే ముందు ప్రకటిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 29 నుండి 30 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.

కౌన్సెలింగ్ కోసం TG EAPCET 2026 ర్యాంక్ కార్డ్, TG EAPCET 2026 హాల్ టికెట్, ఆధార్ కార్డ్, పదవ తరగతి మార్కుల మేమో (పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం) , ఇంటర్మీడియట్ మార్కుల మేమో, 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ/బోనాఫైడ్ సర్టిఫికేట్లు, టీసీ, రిజర్వేషన్, స్కాలర్‌షిప్ కోసం అవసరమైన పత్రాలు ఆదాయ ధ్రువీకరణ పత్రం, కులం ధ్రువీకరణ పత్రం, ఓపెన్ కేటగిరీ వర్తిస్తే EWS సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ పత్రం లాంటి పత్రాలు ఉండాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More