TGFSL Recruitment Results : ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిక్రూట్ మెంట్ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి
TG FSL Recruitment 2025 : ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) రిక్రూట్మెంట్ ఫలితాలు విడుదలయ్యాయి. https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్లో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాత పరీక్ష పూర్తి కాగా…తాజాగా ఇందుకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి.

ఫలితాలను ఇలా చేసుకోండి…
- అభ్యర్థులు ముందుగా https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో FSL (Technical Posts) Recruitment 2025 ఆప్షన్ ఉంటుంది.
- ఇక్కడ సెలెక్టెడ్ క్యాండెట్స్ ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే ఎంపికైన అభ్యర్థుల పేర్లు కనిపిస్తాయి
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందాలి.
ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను మార్చి 5, 6,7 తేదీల్లో నిర్వహించారు. ప్రతిరోజూ మూడు సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేశారు.
ఈనెల 23 నుంచి అటెస్టేషన్:
TG FSLలో వివిధ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్ధులకు అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. మార్చి 23వ తేదీ నుంచి 25వ తేదీలోగా డిజిటల్ అటెస్టేషన్ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు http://tgprb.in ను సందర్శించాలని సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

