భద్రాచలానికి మహర్దశ వచ్చేసింది…! ఇక పట్టణంతో పాటు ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయగా….మొత్తం రూ. 586 కోట్లతో అభివృద్ధ పనులు చేపట్టాలని నిర్ణయించింది. 3 విడతల్లో ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఈ క్రమంలో మొదటి విడత పనుల కోసం రూ. 351 కోట్లు మంజూరు అయ్యాయి.ఈ మేరకు బుధవారం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి.
మొదటి దశలో జరిగే పనులు…

మొదటిదశలో గోదావరి ఘాట్ అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల వంటి పనులు చేస్తారు. ఇందులో గోదావరి ఘాట్కు రూ.75 కోట్లు, ఆలయ సముదాయానికి రూ.180 కోట్లు, పరిసరాల అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించారు. రెండో దశలో ఆలయం సమీపంలో అభివృద్ధి పనులు, మూడో దశలో భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా అభివృద్ధి పనులు జరగుతాయి. ఇదే అంశంపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని సూచించారు.
ఇక మొదటి దశ అభివృద్ధి పనులు ఈ ఏడాదిలోనే మొదలవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గత ఏడాది భద్రాచలం పర్యటనకు వెళ్లిన సందర్భంగా సమగ్ర అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయగా…. తాజాగా నిధులు విడుదలయ్యాయి.
వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి పూర్తి చేస్తారు. గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగుతాయి. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు ముందుకెళ్తాయి. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయనున్నారు.
భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్గా మార్చాలని సర్కార్ యోచిస్తోంది. భద్రాచలం సమీపంలోని రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించటంతో… స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులతో పాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
{{/usCountry}}భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్గా మార్చాలని సర్కార్ యోచిస్తోంది. భద్రాచలం సమీపంలోని రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించటంతో… స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులతో పాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
{{/usCountry}}