TGPSC Notification : త్వరలో 2500 పోస్టుల భర్తీ.. టీజీపీఎస్సీ నుంచి ఇకపై నెలకో నోటిఫికేషన్!
TGPSC Notification : నిరుద్యోగు యువతకు త్వరలో గుడ్న్యూస్ రానుంది. టీజీపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు రానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రతి నెలా ఒక ఉద్యోగ ప్రకటనను జారీ చేయాలని యోచిస్తోంది. ఆర్థిక శాఖ ఆమోదించిన సుమారు 2,500 పోస్టుల కోసం అధికారులు ప్రకటనలు, పరీక్షల షెడ్యూళ్లను సిద్ధం చేస్తున్నారు. జాప్యాన్ని నివారించడం, అభ్యర్థులకు తగినంత సన్నద్ధత సమయం ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం.

పట్టణ ప్రణాళిక, వ్యవసాయం, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర శాఖలలోని పోస్టుల కోసం మరిన్ని ప్రకటనలు సిద్ధం చేస్తున్నారు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డీఐఈటీ లెక్చరర్లు, బీ.ఎడ్ లెక్చరర్లు, ఆర్టీసీ, సివిల్ సప్లైస్ శాఖలలోని పోస్టులకు కూడా నియామకాలు చేపట్టనున్నారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ 2) పోస్టులను భర్తీ చేసేందుకు కమిషన్ ఇప్పటికే ఒక ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది.
యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలతో క్లాష్ కాకుండా టీజీపీఎస్సీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అన్ని పరీక్షలు రాసేందుకు అభ్యర్థులకు అనుకూలంగా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. నియామక ప్రక్రియను మెరుగుపరిచేందుకు టీజీపీఎస్సీ ఒక షెడ్యూల్పై పనిచేస్తోంది.
కొత్త ప్రకటనలకు దరఖాస్తు చేసుకునేందుకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్డేట్ను కమిషన్ తప్పనిసరి చేసింది పబ్లిక్ కమిషన్. దాదాపు 30 లక్షల మంది అభ్యర్థులకు ఓటీఆర్ ఉన్నా.. కేవలం 12 లక్షల మంది మాత్రమే అప్డేట్ చేసుకున్నారు. గడువు పొడిగించినప్పటికీ, సుమారు 6 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే తమ ప్రొఫైల్లను అప్డేట్ చేసుకున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగాలు
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ ప్రకారం.. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 27, 2026 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి మే 25, 2026 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్షను జూలై 2026లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ (https://www.tgpsc.gov.in) సందర్శించాలి. ఇప్పటికే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకున్న వారు తమ ఐడీతో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తు చేసే వారు మొదట ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సమాచారంలో ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకున్న తర్వాతే ఫైనల్ సబ్మిషన్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


