TGPSC Recruitment : గుడ్ న్యూస్… టీజీపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల - పూర్తి వివరాలు
TGPSC Assistant Scientist Notification : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 27 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.
TGPSC Assistant Scientist Notification 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ ప్రకారం…. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 27, 2026 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి మే 25, 2026 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్షను జూలై 2026లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ (https://www.tgpsc.gov.in) సందర్శించాలి. ఇప్పటికే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకున్న వారు తమ ఐడీతో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తు చేసే వారు మొదట ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సమాచారంలో ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకున్న తర్వాతే ఫైనల్ సబ్మిషన్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
రాత పరీక్ష….
ఈ రాత పరీక్షను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) పద్ధతిలో నిర్వహించనున్నారు. పరీక్షను వివిధ సెషన్లలో నిర్వహించే అవకాశం ఉన్నందున, అభ్యర్థుల మార్కులను 'నార్మలైజేషన్' (Normalization) పద్ధతిలో లెక్కిస్తారు. రాత పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వికలాంగులైన అభ్యర్థులకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సహాయకులను (Scribe) ఏర్పాటు చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులకు టీజీపీఎస్సీనే స్క్రైబ్లను కేటాయిస్తుంది. అలాగే వీరికి పరీక్షా సమయంలో అదనపు సమయం కూడా లభిస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

