TG ICET 2026 Counseling : టీజీ ఐసెట్ 2026 చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి - అలాట్మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే
TG ICET 2026 Seat Allotment : టీజీ ఐసెట్ 2026 చివరి విడత కౌన్సెలింగ్ సీట్లను కేటాయించారు. సీట్లు సాధించిన వారు ఈ నెల 24వ తేదీలోపు ఫీజు చెల్లించి.. 25లోపు కళాశాలల్లో రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి.
TG ICET 2026 Seat Allotment :ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ 2026 చివరి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ తుది విడత కౌన్సెలింగ్లో కొత్తగా 11,729 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద మొత్తం 38,462 ఎంబీఏ, ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి మొత్తం 23,988 సీట్లు (62 శాతం) భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు.
ఎంబీఏ కోర్సులో అందుబాటులో ఉన్న 31,181 సీట్లకు గాను 20,889 సీట్లు భర్తీ కాగా, ఎంసీఏ కోర్సులో 7,281 సీట్లకు గాను 3,099 సీట్లు మాత్రమే నిండాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 14,474 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి.
రిపోర్టింగ్ తేదీలు…
టీజీ ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయడానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సీటు సాధించిన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా నిర్ణీత ట్యూషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అనంతరం ఈ నెల 25వ తేదీలోపు తమకు కేటాయించిన కళాశాలల్లో వ్యక్తిగతంగా హాజరై నివేదించాలి (రిపోర్ట్ చేయాలి). గడువులోగా ఫీజు చెల్లించని, కాలేజీలో రిపోర్ట్ చేయని విద్యార్థుల సీట్లు రద్దవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
అలాట్మెంట్ డౌన్లోడ్ ఇలా….
- ముందుగా తెలంగాణ ఐసెట్ అధికారిక వెబ్సైట్ https://tgicet.nic.in/default.aspx ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో కనిపించే 'Candidate Login' ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ ఐడీ (Login ID), హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), పాస్వర్డ్, పుట్టిన తేదీ మరియు స్క్రీన్పై ఉన్న క్యాప్చా కోడ్ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- వివరాలు నమోదు చేసిన తర్వాత మీకు సీటు కేటాయింపు జరిగి ఉంటే, అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ అలాట్మెంట్ కాపీని సేవ్ చేసుకోవచ్చు.
- కళాశాలల్లో ప్రవేశం పొందే సమయంలో ఈ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ, ఫీజు రసీదులు అత్యంత కీలకం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

