...
...
Next Story

TG Inter Exams 2026 : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఫీజు చెల్లింపునకు ఇదే ఫైనల్ ఛాన్స్..!

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. రూ.2 వేల ఆలస్య రుసుంతో డిసెంబరు 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది.

Published on: Dec 24, 2025, 06:02:44 IST
Advertisement

తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షలపై ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల ఆలస్య రుసుంతో ఈ నెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ పరీక్షలు

గత అక్టోబరులో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆలస్య రుసుం గడువు ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దీంతో ఈ గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించారు. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని ఇంటర్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

ఇక ఫైన్ కాకుండా ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ. 530 చెల్లించాలి. ప్రాక్టికల్ పరీక్ష కోసం రూ. 100 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు రూ. 870 చెల్లించాలి. సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ. 530 చెల్లించాలి. ఇంగ్లీష్ ప్రాక్టికల్ కోసం రూ. 100, జనరల్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల కోసం రూ. 870 చెల్లించాలి. సెకండ్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు రూ. 870 చెల్లించాలి. వీటితో పాటే ఆలస్య రుసుం చెల్లించాలి.

ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్…

వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి.రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026:

  • 25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
  • 27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
  • 02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
  • 5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
  • 9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
  • 12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
  • 17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:

  • 26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
  • 28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
  • 04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
  • 6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
  • 10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
  • 13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
  • 16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
  • 18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe