...
...
Next Story

TG LAWCET 2026 Counselling : టీజీ లాసెట్ కౌన్సెలింగ్ గడువు మరోసారి పొడిగింపు - సవరించిన షెడ్యూల్ వివరాలివే

TG LAWCET 2026 Counselling : తెలంగాణలో ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అభ్యర్థులు జూలై 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 21, 2026 07:55 AM IST
Advertisement

TG LAWCET 2026 Counselling : తెలంగాణలో లా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. ఎల్‌ఎల్‌బీ (3 YDC), ఎల్‌ఎల్‌బీ (5 YDC) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ లాసెట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల అప్‌లోడ్ గడువును మరోసారి పొడిగించారు.

ఈనెల 29 వరకు గడువు పొడిగింపు…

టీజీ లాసెట్ కౌన్సెలింగ్ గడువు మరోసారి పొడిగింపు
టీజీ లాసెట్ కౌన్సెలింగ్ గడువు మరోసారి పొడిగింపు

అర్హులైన అభ్యర్థులు జూలై 28 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. గతంలో ఇచ్చిన గడువు జూలై 20వ తేదీతో ముగియడంతో... విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్వీనర్ కార్యాలయం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ అంతా కూడా ఈ పొడిగించిన గడువు లోపే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు…

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల అప్‌లోడ్: జూలై 28 వరకు అవకాశం ఉంటుంది.
  • అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన (సవరణల అవకాశం): జూలై 28
  • మొదటి విడత వెబ్ ఆప్షన్ల నమోదు: జూలై 28 నుండి జూలై 31 వరకు
  • వెబ్ ఆప్షన్ల ఎడిట్ అవకాశం: ఆగస్టు 1 , 2026
  • మొదటి విడత సీట్ల కేటాయింపు (వెబ్‌సైట్‌లో): ఆగస్టు 5, 2026
  • కళాశాలల్లో రిపోర్టింగ్: ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు

టీజీ లాసెట్ - 2026లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు ఉంటే అధికారిక ఈ-మెయిల్ (tgcetsadmissions2026@gmail.com) ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.

అభ్యర్థులు సాధించిన ర్యాంకులతో పాటు వారి రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే వాళ్లు… నిర్దేశించిన తేదీలలోపే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఇక గడిచిన కొంతకాలంగా లా కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ సీట్లకు తెగ డిమాండ్ ఉంటోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe