TG LAWCET Counselling : టీజీ లాసెట్ ఫేజ్ - 2 సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి
TG LAWCET Phase 2 Allotment : టీజీ లాసెట్ ఫేజ్-2 సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అలాట్ మెంట్ చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 5లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
TG LAWCET Phase 2 Allotment : తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్ రెండవ విడత (ఫేజ్-2) సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. కౌన్సెలింగ్లో పాల్గొని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీ మరియు కోర్సు వివరాలను కౌన్సెలింగ్ అధికారిక వెబ్సైట్ ద్వారా నేరుగా పరిశీలించుకోవచ్చు.

అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోవచ్చు…
- మొదటగా కౌన్సెలింగ్ అధికారిక వెబ్సైట్ https://lawcetadm.tgche.ac.in/ ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో కనిపించే 'Candidate Allotment Login Phase II' లింక్పై క్లిక్ చేయాలి.
- అనంతరం అభ్యర్థి తన లాసెట్ హాల్ టికెట్ నంబరు, సాధించిన ర్యాంకు, రిజిస్టర్డ్ మొబైల్ నంబరు మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- ఆ తర్వాత మీ లాగిన్ పాస్వర్డ్ను కూడా సరిగ్గా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- వివరాలు సమర్పించగానే అభ్యర్థికి సంబంధించిన సీట్ అలాట్మెంట్ లెటర్ స్క్రీన్పై ప్రత్యక్షమవుతుంది.
అలాట్ మెంట్ లో కాలేజీ వివరాలు చూసుకున్న తర్వాత, అభ్యర్థులు తమ ప్రవేశాన్ని ఖరారు చేసుకోవడానికి నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజును ఆన్లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. అలాట్మెంట్ పేజీలోనే కనిపించే 'Pay Fee' అనే ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా పేమెంట్ గేట్వేకి వెళ్లవచ్చు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా UPI ద్వారా నిర్ణీత ఫీజును విజయవంతంగా చెల్లించాలి.
ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత కంప్యూటర్ జనరేట్ చేసిన అక్నాలెడ్జ్మెంట్ రసీదు మరియు 'జాయినింగ్ రిపోర్ట్' (Joining Report) లను తప్పనిసరిగా ప్రింటౌట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
కాలేజీల్లో రిపోర్టింగ్ - సెప్టెంబర్ 5 ఆఖరు తేదీ…
టీజీ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్లో సీటు సాధించిన అభ్యర్థులకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయడానికి అధికారులు స్పష్టమైన సమయాన్ని కేటాయించారు. అభ్యర్థులు ఈనెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు తమకు కేటాయించిన కళాశాలలకు నేరుగా వెళ్లి విద్యార్హత ధృవీకరణ పత్రాలు, ఫీజు రసీదు, జాయినింగ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది.
నిర్దేశిత గడువు తేదీ అయిన సెప్టెంబర్ 5వ తేదీ లోపు సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు కేటాయింపును రద్దు చేస్తారు. కాబట్టి అర్హులైన విద్యార్థులు వెంటనే ఫీజు చెల్లించి రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

