TGRJC CET Notification 2026 : ఇంటర్ అడ్మిషన్లు - టీజీఆర్జేసీ సెట్ నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలు
TGRJC CET Notification 2026 Updates : టీజీఆర్ జేసీ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 16 నుంచి ప్రారంభమవుతుంది.
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్(TGRJC CET) జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈనెల 16 నుంచి దరఖాస్తులు
టీజీఆర్ జేసీ సెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అప్లికేషన్ ఫీజు కింద రూ. 200 చెల్లించాలి. ఏప్రిల్ 15వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. మే 3వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ఇంగ్లీషు మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. సీటు పొందే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది.మార్చి 2026లో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ (మెరిట్)తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. అర్హత గల విద్యార్థులు వెబ్సైట్ http://tgrjc.cgg.gov.in/. ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం వెబ్సైట్లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్ను చూడొచ్చు. 040-24734899 ఫోన్ నంబర్ను సంప్రదించి… వివరాలను తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











