TGRJC CET Applications 2026 : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్(TGRJC CET) జారీ అయిన సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా… ఈ గడువు నేటితో (ఏప్రిల్ 15) ముగియనుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు… వెంటనే అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మే 3వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్…

టీజీఆర్ జేసీ సెట్ అప్లికేషన్ ఫీజు కింద రూ. 200 చెల్లించాలి. ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. సీటు పొందే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది.మార్చి 2026లో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 3వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ (మెరిట్)తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. అర్హత గల విద్యార్థులు వెబ్సైట్ http://tgrjc.cgg.gov.in/. ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం వెబ్సైట్లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్ను చూడొచ్చు. 040-24734899 ఫోన్ నంబర్ను సంప్రదించి… వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ఏడాది గురుకులాల్లో ప్రవేశం కోసం విద్యార్థుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. అందుబాటులో ఉన్న మొత్తం 6,700 సీట్ల కోసం ఇప్పటివరకు సుమారు 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ప్రతి ఒక్క సీటుకు 9 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు.
- జనరల్ గురుకుల కళాశాలలు: 35 కాలేజీల్లో మొత్తం 3,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (KGBV): 93 విద్యాలయాల్లో మొత్తం 3,700 సీట్లు ఉన్నాయి.
ఈ ఏడాది ఈ ప్రవేశ ప్రక్రియలో విద్యాశాఖ ఒక కీలక మార్పును చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా (COE) రూపుదిద్దుకున్న 93 కేజీబీవీల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. గతంలో ఇక్కడ ప్రవేశాల తీరు వేరుగా ఉండేది. కానీ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇప్పుడు పోటీ పరీక్ష ద్వారానే విద్యార్థులను ఎంపిక చేస్తారు.
{{/usCountry}}ఈ ఏడాది ఈ ప్రవేశ ప్రక్రియలో విద్యాశాఖ ఒక కీలక మార్పును చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా (COE) రూపుదిద్దుకున్న 93 కేజీబీవీల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. గతంలో ఇక్కడ ప్రవేశాల తీరు వేరుగా ఉండేది. కానీ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇప్పుడు పోటీ పరీక్ష ద్వారానే విద్యార్థులను ఎంపిక చేస్తారు.
{{/usCountry}}ప్రధానంగా ఎంపీసీ (MPC), బైపీసీ , ఎంఈసీ/సీఈసీ గ్రూపుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. పదో తరగతి స్థాయిలో చదివిన అంశాల ఆధారంగానే ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎంపికైన వారికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వసతితో కూడిన నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుంది.