వెతెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్(TGRJC CET) జారీ అయిన సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం….

టీజీఆర్ జేసీ సెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ఫీజు కింద రూ. 200 చెల్లించాలి. ఏప్రిల్ 15వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. మే 3వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ఇంగ్లీషు మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. సీటు పొందే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది.మార్చి 2026లో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ (మెరిట్)తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఇతర వివరాల కోసం వెబ్సైట్లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్ను చూడొచ్చు. 040-24734899 ఫోన్ నంబర్ను సంప్రదించి… వివరాలను తెలుసుకోవచ్చు.
అప్లికేషన్ విధానం:
- అభ్యర్థులు http://tgrjc.cgg.gov.in/. వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ముందుగా నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ పై క్లిక్ చేయాలి.
- విద్యార్థి వివరాలను నమోదు చేయటంతో పాటు ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.