TGSRTC App : ప్రయాణికులకు గుడ్ న్యూస్ - కొత్తగా 'మీసేవా – మీ టికెట్ యాప్', ఈ సేవలన్నీ పొందొచ్చు...
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ మరో సౌకర్యాన్ని కల్పించింది. కేవలం ఆన్లైన్, రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా మాత్రమే కాకుండా… మీ సేవ మొబైల్ యాప్లో కూడా బస్ టిక్కెట్లను బుక్ చేసుకునే ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ప్రయాణీకుల సౌలభ్యాన్ని పెంపొందించడానికి “మీసేవా – మీ టికెట్ మొబైల్” యాప్ ద్వారా బస్సు టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించింది.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కొత్త మీ సేవ మీ టికెట్ యాప్ను మంగళవారం ప్రారంభించారు. రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి, మీ సేవ కమిషనర్ రవికిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మొబైల్ యాప్ను ఆవిష్కరించి.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ ఓపీఆర్ఎస్ (OPRS) సేవలను కూడా అనుసంధానించారు. దీంతో ప్రయాణికులు దూర ప్రయాణాలు, ఇంటర్సిటీ బస్ టిక్కెట్లను కూడా డిజిటల్గా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
- మొత్తం OPRS సేవలు 1,710
- ఏసీ సేవలు - 450
- నాన్ ఏసీ సేవలు - 1,260
- రోజువారీగా బుకింగ్ ఆయ్యే సీట్లు - 13,000
బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్ వంటి హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
గ్రేటర్ పరిధిలోని పాస్ లు కూడా…
గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 5 రకాల బస్ పాస్లను కూడా పొందే సౌకర్యంతోపాటు రెన్యూవల్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు.ఈ నిర్ణయం వల్ల బస్ పాస్ కౌంటర్లకు వెళ్లే ఇబ్బందులు తప్పుతాయని… చాలా సులభంగా బస్ పాస్ రెన్యూవల్ కూడా చేసుకోవచ్చని అధికారులు వివరించారు. వీటికి సంబంధించిన కేటగిరీలు, ఛార్జీలు చూస్తే….
- సిటీ ఆర్డినరీ పా స్ -1,400(నెలకు)
- మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 0 రూ.1,600
- మెట్రో డీలక్స్ పాస్ - రూ.1,800
- గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ నెలవారీ పాస్ - రూ.2,200
- పుష్పక్ ఏసీ పాస్ - రూ.5,000
గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో T-24 టికెట్ ని కూడా మీ టికెట్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ టికెట్లు ప్రతిరోజూ 16 వేలకుపైగా సేల్ అవుతున్నట్లు పేర్కొన్నారు. పెద్దలకు రూ. 130, చిన్నారులకు రూ. 90గా ధర ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

