TGSRTC Rakhi Special Buses : రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) తియ్యటి కబురు అందించింది. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రవాణా సౌకర్యాలను సులభతరం చేసేందుకు సంస్థ యాజమాన్యం విస్తృత స్థాయి ఏర్పాట్లు పూర్తి చేసింది.
గత ఏడాది కంటే అదనంగా 240 బస్సులు!

పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని 2026 ఆగస్టు 27 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా సంస్థ 4,760 ప్రత్యేక బస్సులను మాత్రమే నడిపింది. అయితే ఈ ఏడాది ప్రయాణికుల తాకిడి గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో, గతంతో పోలిస్తే అదనంగా మరో 240 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన మార్గాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తక్షణమే మరిన్ని అదనపు బస్సులను డిపోల నుంచి రోడ్డుపైకి తీసుకురావాలని డిపో మేనేజర్లను, రీజినల్ మేనేజర్లను ఆదేశించారు.
తిరుగు ప్రయాణాలపై ప్రత్యేక దృష్టి….
పండుగ రోజు ముగిసిన తర్వాత తిరిగి నగరాలకు, పనిప్రాంతాలకు చేరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆగస్టు 31 సోమవారం రోజంతా తిరుగు ప్రయాణాల రద్దీ అత్యంత భారీగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేసింది. ఈ సమయాన్ని పురస్కరించుకుని ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
పండుగ రోజుల పొడవునా ఆర్టీసీ అధికారులు ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రధాన బస్టాండ్లు, తాత్కాలిక బస్ పాయింట్లు, రద్దీ కూడళ్లలో ఉంటూ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించకుండా ఎప్పటికప్పుడు బస్సులను కేటాయించాలని ఆదేశించారు.
{{/usCountry}}పండుగ రోజుల పొడవునా ఆర్టీసీ అధికారులు ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రధాన బస్టాండ్లు, తాత్కాలిక బస్ పాయింట్లు, రద్దీ కూడళ్లలో ఉంటూ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించకుండా ఎప్పటికప్పుడు బస్సులను కేటాయించాలని ఆదేశించారు.
{{/usCountry}}తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రాఖీ పండుగ రోజుల్లోనూ యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వారికి తగినన్ని బస్సులను అందుబాటులో ఉంటాయి.